News April 30, 2024

ఏజెంట్ల వివరాలు సాయంత్రంలోగా అందించాలి: కలెక్టర్

image

విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టరేట్లో సమర్పించాలని ఆర్ఓ, జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జున సూచించారు. ఫారం- 8 ద్వారా రెండు సెట్ల వివరాలు అందజేయాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల వివరాలు మే 8వ తేదీలోగా, కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు మే 25 లోగా అందజేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించామని పేర్కొన్నారు.

Similar News

News October 31, 2025

విశాఖ: ‘ఫైన్లు ఈ విధంగా చెల్లించాలి’

image

రవాణా శాఖ, పోలీసు డిపార్టుమెంట్ వాహన తనిఖీలలో భాగంగా నమోదైన కేసులల్లో విధించిన ఫైన్లు చెల్లించాలని ఉప రవాణా కమిషనర్ ఆర్.సి.హెచ్.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. తనిఖీలలో భాగంగా రాసిన కేసులను (https://echallan.parivahan.gov.in/) సైట్ ద్వారా చెల్లించాలన్నారు. రవాణా, రవాణేతర వాహనాల త్రైమాసం పన్నులు, ఇతర సేవలకై vahan.parivahan.gov.in చెల్లించవచ్చన్నారు.

News October 31, 2025

భాగస్వామ్య సదస్సు విజయవంతంపై కలెక్టర్ సమీక్ష

image

విశాఖలో ఈ నెల 14,15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. AU ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే ఈ సదస్సును అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని విజయవంతం చేయాలని ఆదేశించారు. నగర సుందరీకరణ, అతిథుల వసతి, భద్రత, రాకపోకలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News October 31, 2025

సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

image

సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం సిరిపురం జంక్షన్ వద్ద గల పటేల్‌ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహనీయుడు సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.