News December 22, 2024

‘ఏజెన్సీ ప్రాంతాల్లో భాషా ప్రాతిపదికన ఉద్యోగాల నియామకాలు జరపాలి’

image

విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో భాష ప్రాతిపాదికన నియామకాలు చేపట్టాలని ఖానాపూర్ MLA వెడ్మ భొజ్జు పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో గిరిజనుల బతుకులు ఆగమ్యగోచరంగా మారిందన్నారు. కావున, ఏజెన్సీ ప్రాంతంలో భాష ప్రాతిపాదికన గిరిజనులకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలన్నారు.

Similar News

News November 1, 2025

ఆదిలాబాద్: ప్రభుత్వ పథకాలపై సమగ్ర అధ్యయనం

image

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలపై సమగ్ర అధ్యయనం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం అధ్యయనం నిమిత్తం జిల్లాకు వచ్చిన IAS, IPS, IRS, IES, ISS అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో DFO ప్రశాంత్ బాజీరావు పాటిల్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు ఎస్పీ కాజల్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, అధికారులు పాల్గొన్నారు.

News November 1, 2025

ADB: స్వయం ఉపాధి దిశగా యువత ముందుకు రావాలి: కలెక్టర్

image

ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి అవకాశాలను యువత పూర్తిగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్‌లోని టీటీడీసీ భవనంలో నిర్వహించిన ఇందిరమ్మ సెంట్రింగ్ యూనిట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 1, 2025

భీంపూర్‌లో పులి సంచారం

image

భీంపూర్ మండలంలో పులి సంచారం రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. శనివారం ఉదయం పిప్పల్ కోటి, గూడ గ్రామాల శివారులోని యాల్ల కేశవ్, పొగుల రమేశ్ పంట పొలాల్లో పులి కనిపించింది. గమనించిన కూలీలు భయంతో ఇంటికి వెళ్లిపోయినట్లు గ్రామస్థలుు తెలిపారు. కాగా ప్రస్తుతం పులి గర్భం దాల్చినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు.