News December 22, 2024
‘ఏజెన్సీ ప్రాంతాల్లో భాషా ప్రాతిపదికన ఉద్యోగాల నియామకాలు జరపాలి’
విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో భాష ప్రాతిపాదికన నియామకాలు చేపట్టాలని ఖానాపూర్ MLA వెడ్మ భొజ్జు పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో గిరిజనుల బతుకులు ఆగమ్యగోచరంగా మారిందన్నారు. కావున, ఏజెన్సీ ప్రాంతంలో భాష ప్రాతిపాదికన గిరిజనులకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలన్నారు.
Similar News
News January 25, 2025
27 నుంచి ప్రతి మండలంలో ప్రజావాణి: ADB కలెక్టర్
ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా ప్రజావాణి కార్యక్రమం ఇక నుంచి ప్రతి రోజూ మండలంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈ నెల 27 నుంచి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ, ఉపాధి హామీ, పెన్షన్, రేషన్ కార్డులు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై దరఖాస్తులు ఆయా మండలాల్లో కార్యాలయ అర్జీలను సమర్పించాలన్నారు.
News January 24, 2025
రైల్వే జీఎంను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ నగేష్
సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ను సికింద్రాబాద్లోని ఆయన కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులతో పాటు రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ విషయాలపై రైల్వే జిఎం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
News January 24, 2025
ADB: JAN 28 నుంచి కందుల కొనుగోళ్లు
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేది నుంచి కందుల కొనుగోలు ప్రారంభమవుతాయని మార్క్ ఫెడ్ డీఏం ప్రవీణ్ రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 30 నుంచి జైనథ్ మార్కెట్ యార్డ్లో సైతం కొనుగోలు ప్రారంభమవుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి కందులను మార్కెట్ యార్డుకు తీసుకొని రావాలని సూచించారు.