News January 26, 2025
ఏటికొప్పాక: అందరిని ఆకట్టుకున్న లక్క బొమ్మల శకటం

ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన ఏటికొప్పాక లక్క బొమ్మల శకటం ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులను ఆకట్టుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. పర్యావరణహితమైన, సహజ సిద్ధమైన వనరులతో తయారుచేసిన ఏటికొప్పాక లక్కబొమ్మలు ఏపీ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయన్నారు. శకటాల పరంపరలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.
Similar News
News November 23, 2025
ములుగు: మహిళా సంఘాలకు మంత్రి శుభవార్త

ములుగు జిల్లా మహిళా సంఘాలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. రానున్న మేడారం జాతర సమయంలో వేలాది మంది భక్తులు జాతరకు వస్తారని, ఈ సందర్భంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఫుడ్ కోర్ట్స్, దుకాణాలు, వ్యాపారాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు.
News November 23, 2025
భారీ జీతంతో SIDBIలో ఉద్యోగాలు

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News November 23, 2025
రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జనగామ కలెక్టర్

కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపు రద్దు చేస్తున్నట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాష షేక్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో, అలాగే స్వయం సహాయక సంఘ సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు విధి నిర్వహణలో ఉన్నందున రేపటి గ్రీవెన్స్ సెల్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.


