News January 26, 2025
ఏటికొప్పాక: అందరిని ఆకట్టుకున్న లక్క బొమ్మల శకటం

ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన ఏటికొప్పాక లక్క బొమ్మల శకటం ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులను ఆకట్టుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. పర్యావరణహితమైన, సహజ సిద్ధమైన వనరులతో తయారుచేసిన ఏటికొప్పాక లక్కబొమ్మలు ఏపీ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయన్నారు. శకటాల పరంపరలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.
Similar News
News November 21, 2025
బిహార్ ఎన్నికలపై ఆరోపణలు.. ECI వివరణ ఇవ్వాలని డిమాండ్!

బిహార్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ లెక్కలు సరిపోలడం లేదని పొలిటికల్ ఎకనామిస్ట్ పి.ప్రభాకర్ ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్లో 1,77,673 ఓట్లు ఎక్కువగా వచ్చాయని Xలో <
News November 21, 2025
జర్నలిస్ట్లు అక్రిడేషన్కు దరఖాస్తు చేసుకోవాలి : DIPRO

2026 – 2027 సంవత్సరానికి గాను అక్రిడేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు DIPRO, I&PR కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. https://mediarelations.ap.gov.in/media/#/home/index లింకు ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిపోర్టర్ తమ పేరు, హోదా, మెయిల్ అడ్రస్, ఆధార్ నెంబరు, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ నమోదు చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ కావాలన్నారు. పూర్తి వివరాలతో దరఖాస్తును ఆన్లైన్ ద్వారా పంపించాలన్నారు.
News November 21, 2025
NZB: హమారా ‘నిఖత్’ హ్యాట్రిక్ విన్నర్

గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. నిఖత్ 51 కేజీల విభాగంలో తైవాన్ క్రీడాకారిణిపై 5-0తో గెలిచింది. దీంతో వరుసగా 3 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022, 2023, 2025 సంవత్సరాల్లో జరిగిన టోర్నీల్లో బంగారు పతకం గెలుపొందింది. 2024లో ఒలింపిక్ క్రీడల వల్ల ఈ టోర్నీలు జరగ లేదు.


