News March 7, 2025
ఏటికొప్పాక లక్కబొమ్మల స్టాల్ను సందర్శించిన రాష్ట్రపతి

ఏటికొప్పాక లక్క బొమ్మల స్టాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. వివిధత కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల హస్త కళాకారులు రూపొందించిన బొమ్మలు వస్త్రాలను ఈనెల 4 నుంచి 9 వరకు రాష్ట్రపతి భవన్లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. ఏటికొప్పాక బొమ్మలను ఆసక్తిగా రాష్ట్రపతి తిలకించారు. వాటిని ఏ విధంగా తయారు చేస్తారో కళాకారుడు శరత్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 27, 2025
పెళ్లికి రెడీ.. అమ్మాయి కావాలి అంతే: చాహల్

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్లో స్టైలిష్ ఫొటోలను షేర్ చేసిన ఈ స్పిన్నర్.. ‘నేను పెళ్లికి రెడీగా ఉన్నా. అమ్మాయి కావాలి అంతే’ అని క్యాప్షన్ పెట్టారు. భార్యతో విడాకులు అయితే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తారని, కానీ చాహల్ కాన్ఫిడెన్స్కు మెచ్చుకోవాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News November 27, 2025
ములుగు: ఎన్నికల సమాచారం కోసం కంట్రోల్ రూమ్

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 48 సర్పంచ్, 420 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నిర్వహణ కోసం ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఎంసీఎంసీ, ఎంసీసీ, ఇతర ఎన్నికల సంబంధిత పర్యవేక్షణ అధికారులను నియమించామని చెప్పారు.
News November 27, 2025
బాధ్యతతో విధులు నిర్వర్తించాలి: ములుగు SP

మేడారం జాతర ఏర్పాట్లలో అలసత్వం వహించొద్దని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. ములుగులో మేడారం జాతరపై సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జాతరలో ఎలాంటి అలసత్వం వహించొద్దని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై విస్తృతంగా చర్చించి, ప్రతి అధికారి వారికి అప్పగించిన పనిని నిబద్ధత, బాధ్యతతో నిర్వర్తించాలన్నారు.


