News March 7, 2025

ఏటికొప్పాక లక్కబొమ్మల స్టాల్‌ను సందర్శించిన రాష్ట్రపతి

image

ఏటికొప్పాక లక్క బొమ్మల స్టాల్ ‌రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. వివిధత కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల హస్త కళాకారులు రూపొందించిన బొమ్మలు వస్త్రాలను ఈనెల 4 నుంచి 9 వరకు రాష్ట్రపతి భవన్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. ఏటికొప్పాక బొమ్మలను ఆసక్తిగా రాష్ట్రపతి తిలకించారు. వాటిని ఏ విధంగా తయారు చేస్తారో కళాకారుడు శరత్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 27, 2025

అయోధ్య ఆలయంలో హైదరాబాద్ కిటికీలు

image

కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిథాని) సంస్థ అయోధ్యలోని రామాలయం కోసం కిటికీలను తయారుచేసింది. టైటానియం ఆర్కిటెక్చరల్‌ విండోలను తయారుచేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిథాని అధికారులు తెలిపారు. 31 కీటికీలను తయారు చేసి ఆలయానికి ఇచ్చామని వివరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రదక్షణ కారిడార్‌ కోసం ఇంజినీరింగ్‌ విభాగం వీటిని తయారుచేసింది.

News November 27, 2025

RR: తొలి విడతలో 7 మండలాలు.. 174 GPలు

image

రంగారెడ్డిలో మొత్తం 21 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. తొలి విడతలో నామినేషన్లను నేటి నుంచి స్వీకరిస్తున్నారు. కొత్తూరు(12), నందిగామ(19), కేశంపేట(29), కొందుర్గు(22), చౌదరిగూడ(24), ఫరూఖ్‌నగర్(47), శంషాబాద్‌ 21 జీపీలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 174 పంచాయతీల్లో 1530 వార్డులున్నాయి. 7 మండలాలకు 1530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 11న ఎన్నిక, అదే రోజు ఫలితం వెలువడనుంది

News November 27, 2025

ఆ మృగం మూల్యం చెల్లించుకోక తప్పదు: ట్రంప్

image

వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌ వద్ద <<18399882>>కాల్పుల ఘటనపై<<>> US అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించారు. నిందితుడిని మృగంగా సంబోధిస్తూ.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘ఇద్దరు నేషనల్ గార్డ్‌మెన్‌లను ఆ యానియల్ తీవ్రంగా గాయపర్చింది. వారికి చికిత్స అందిస్తున్నాం. నిందితుడిని వదలబోం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాల్పుల నేపథ్యంలో వైట్‌హౌస్‌ను లాక్‌డౌన్ చేసిన విషయం తెలిసిందే.