News March 7, 2025

ఏటికొప్పాక లక్కబొమ్మల స్టాల్‌ను సందర్శించిన రాష్ట్రపతి

image

ఏటికొప్పాక లక్క బొమ్మల స్టాల్ ‌రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. వివిధత కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల హస్త కళాకారులు రూపొందించిన బొమ్మలు వస్త్రాలను ఈనెల 4 నుంచి 9 వరకు రాష్ట్రపతి భవన్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. ఏటికొప్పాక బొమ్మలను ఆసక్తిగా రాష్ట్రపతి తిలకించారు. వాటిని ఏ విధంగా తయారు చేస్తారో కళాకారుడు శరత్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 22, 2025

జగిత్యాల: జర్మనీలో చదువు.. ఉద్యోగ అవకాశాలు

image

టామ్ కం ఆధ్వర్యంలో జర్మనీలో నర్సింగ్ లో 3 సంవత్సరాల ఇంటర్నేషనల్ డిగ్రీ పొందడానికి తర్వాత నర్సుగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తుందని జిల్లా ఉపాధి కల్పనా అధికారి సత్యమ్మ తెలిపారు. ఇంటర్ 60% మార్కులతో ఉత్తీర్ణులై 18-28 వయసుగల వారు అర్హులన్నారు. శిక్షణ సమయంలో లక్ష స్టైఫండ్, అనంతరం 2 నుండి 3 లక్షల ఆకర్షణీయ జీతంతో ఉద్యోగ హామీ లభిస్తుందన్నారు. వివరాలకు 6302292450 నెంబర్లో సంప్రదించాలన్నారు.

News October 22, 2025

‘చింతలపూడిలో మౌలిక వసతులను కల్పించండి’

image

చింతలపూడి MLA సొంగా రోషన్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. చింతలపూడి, లింగపాలెం మండలాలను ఏలూరు రెవెన్యూ డివిజన్‌లో కలపాలని అన్నారు. రహదారుల అభివృద్ధి, ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని కోరారు. తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గుత్తా వేంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

News October 22, 2025

విజయనగరం ఉత్సవాలకు రూ.2.02 కోట్ల విరాళాలు: కలెక్టర్

image

విజయనగరం ఉత్సవాలకు 435 మంది దాతలు మొత్తం రూ.2.02 కోట్లు విరాళంగా అందించారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. వాటిలో రూ.1.41 కోట్లు ఉత్సవాల నిర్వహణకు వినియోగించగా.. మిగిలిన రూ.61 లక్షలు వచ్చే ఏడాది ఉత్సవాలకు ఉంచినట్లు ఆయన వివరించారు. 12 వేదికలపై సాహిత్య, సంగీత, నృత్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని, ఉత్సవాల విజయానికి సహకరించిన దాతలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.