News March 7, 2025

ఏటికొప్పాక లక్కబొమ్మల స్టాల్‌ను సందర్శించిన రాష్ట్రపతి

image

ఏటికొప్పాక లక్క బొమ్మల స్టాల్ ‌రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. వివిధత కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల హస్త కళాకారులు రూపొందించిన బొమ్మలు వస్త్రాలను ఈనెల 4 నుంచి 9 వరకు రాష్ట్రపతి భవన్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. ఏటికొప్పాక బొమ్మలను ఆసక్తిగా రాష్ట్రపతి తిలకించారు. వాటిని ఏ విధంగా తయారు చేస్తారో కళాకారుడు శరత్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 25, 2025

7.81L సిమ్ కార్డులు, 83K వాట్సాప్ ఖాతాలు బ్లాక్: బండి

image

ప్రజలను తప్పుదోవ పట్టించడం, డిజిటల్ అరెస్టుల పేరిట మోసాలు చేస్తున్న వారిని కట్టడి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ ఏడాది FEB వరకు 7.81L సిమ్ కార్డులు, 83K వాట్సాప్ ఖాతాలను, 2.08L IMEIలను బ్లాక్ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.4,386 కోట్లను కాపాడినట్లు పార్లమెంటులో సమాధానమిచ్చారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు https://cybercrime.gov.in పోర్టల్‌ను ప్రారంభించామన్నారు.

News March 25, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✔MBNR: PUలో ఉగాది కవి సమ్మేళనం!
✔BRS హయాంలో రంజాన్ తోఫా ఇచ్చే వాళ్ళం: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
✔NGKL:SLBC ఘటన.. మరొకరు మృతి
✔పలుచోట్ల ఇఫ్తార్ విందు!
✔GWL:Way2News Effect..అనాథలను రూ.4.15 లక్షలు అందజేత
✔పీయూ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ
✔కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
✔కరెంటు కోతలపై వనపర్తిలో రైతుల ధర్నా
✔NGKL:SLBC ఘటన..బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం: కలెక్టర్

News March 25, 2025

శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు: ఎస్పీ

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో జరగనున్న ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మంగళవారం తెలిపారు. ప్రత్యేకించి క్షేత్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

error: Content is protected !!