News March 3, 2025

ఏటికొప్పాక: హస్త కళాకారుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

image

ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో కలెక్టర్ విజయకృష్ణన్ సోమవారం పర్యటించారు. ఏటి కొప్పాక లక్క బొమ్మలు తయారు చేసే హస్త కళాకారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లక్క బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్రకు కొరత ఏర్పడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రాష్ట్రపతి అవార్డు గ్రహీత చిన్నయచారి, రిపబ్లిక్‌డే శకటం డిజైనర్ గోర్స సంతోష్ కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

Similar News

News October 21, 2025

విడాకులకు దారితీసే 4 కారణాలివే: నిపుణులు

image

వైవాహిక జీవితంలో విడాకులకు దారితీసే 4 ప్రధాన అంశాలపై మానసిక నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అవే.. సమర్థించుకోవడం, విమర్శించడం, ధిక్కారం, చెప్పింది వినకపోవడం. ‘ఈ లక్షణాలు భాగస్వాముల మధ్య దూరాన్ని పెంచి బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ నాలుగు అంశాలను నియంత్రించకపోతే వివాహ రథం విడాకులవైపు వేగంగా పయనించడం ఖాయం’ అని నిపుణులు సూచిస్తున్నారు. సామరస్యం కోసం వాటిని దూరం పెట్టాలి. Share it

News October 21, 2025

సూర్యాపేట: సలాం పోలీసన్నా..!

image

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరుల సేవలను స్మరించుకుంటూ నేడు(అక్టోబరు 21) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసారు. 2003లో చింతలపాలెం వద్ద నక్సల్స్‌ మందుపాతర దాడిలో ముగ్గురు, 2007లో తిరుమలగిరి దాడిలో ఇద్దరు, 2015లో హైటెక్ బస్టాండ్‌ ఘటనలో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు.

News October 21, 2025

తూర్పుగోదావరి జిల్లా నుంచి తొలి ఐపీఎస్‌ ఆయనే..!

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జన్మించిన పీవీ రంగయ్య నాయుడు జిల్లా నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 21 ఏళ్లకే ఆయన ఐపీఎస్ కావడం గమనార్హం. డీజీపీగా, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన సేవలు అందించారు. సర్వీస్ అనంతరం ఆయన రాజకీయాల్లో చేరి, ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర విద్యుత్, నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.