News July 13, 2024

ఏటూరునాగారంలో ఘోర ప్రమాదం.. పరారీలో కంటైనర్ డ్రైవర్

image

ఏటూరునాగారం మండలం జాతీయ రహదారిలోని హైవే ట్రీట్ వద్ద శనివారం రాత్రి ఆటో, కంటైనర్ ఢీకొనగా<<13623871>> ముగ్గురు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమైన కంటైనర్ వాహనాన్ని ప్రమాద స్థలం వద్ద డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. కాగా వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ వద్ద స్థానికులు కంటైనర్‌ను పట్టుకున్నారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు వాజేడు ఎస్సై హరీశ్ తెలిపారు.

Similar News

News December 10, 2025

WGL: పల్లెల్లో ఎన్నికల పండగ..!

image

ఉమ్మడి WGL జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం తొలి విడత జరగనుంది. పల్లెల్లో ఎన్నికల పర్వం పండగ వాతావరణం సృష్టించగా, అభ్యర్థుల గుణగణాల మీద చర్చలు జోరందుకున్నాయి. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా, అభ్యర్థులు పార్టీ కండువాలతోనే ప్రచారం చేస్తూ ఊర్లో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. బయట ఉన్న ఓటర్లకు ఫోన్లు చేసి రానుపోను ఖర్చులు ఇస్తామని చెబుతున్నారు.

News December 10, 2025

WGL: నా గుర్తు స్టూల్.. ఇదిగో నీకో కుర్చీ..!

image

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాబర్తీ గ్రామంలో ఓటర్లను ఆకర్షించేందుకు వార్డు అభ్యర్థులు తగ్గేదేలే అంటున్నారు. మొన్నటికి మొన్న ఓ పార్టీ క్వార్టర్ మందు ఇస్తే మరో పార్టీ అర కిలో చికెన్ ఇచ్చి ఆకర్షించింది. ఇక మరో వార్డు అభ్యర్థి తనకు గుర్తు కుర్చీ కేటాయించడంతో ఏకంగా ఓటర్లకు కుర్చీలను పంచి పెట్టడం వైరల్‌గా మారింది. ఆటోలో ఇంటింటికీ తిరుగుతూ ఒక్కో ఓటుకు ఒక్కో కూర్చి ఇచ్చి తన గుర్తు ఇదే అంటున్నాడు.

News December 10, 2025

వరంగల్: ప్రచారం ముగిసింది.. ప్రలోభాలకు వేలయింది..!

image

జిల్లాలో ప్రచారానికి తెరపడడంతో పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు మందు సీసాలు, మటన్, చీరలు, మిక్సీలు, నగదు పంపిణీకి గుట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ నెల 11వ తేదీ పోలింగ్‌కు అధికారులు 800 బూత్‌లను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. మఫ్టీలో పోలీసులు పర్యటిస్తూ శాంతిభద్రతలకు చర్యలు చేపడుతున్నారు.