News February 23, 2025
ఏటూరునాగారం ఐటీడీఏ గిరిజన మహిళలకు శిక్షణ

ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన మహిళలకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో చేపట్టినట్లు జేడీఎం కొండలరావు తెలిపారు. ఉట్నూరులో తయారీ అవుతున్న ఇప్పపువ్వు లడ్డు, నాప్కిన్ తయారీపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు అభివృద్ధి చెందడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తయారీకి ఉపయోగించే ముడి సరుకు, నాణ్యత గురించి తెలుసుకున్నారన్నారు.
Similar News
News September 18, 2025
నేడు బాపట్ల జిల్లాకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం ఒక ఒక ప్రకటనలో చెప్పారు. అల్ప పీడన ప్రభావంతో గురువారం బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
News September 18, 2025
ఏలూరు: రోడ్డు పక్కన గాయాలతో బాలుడు.. ఆచూకీ లభ్యం

ఏలూరులోని వట్లూరు వద్ద బుధవారం రాత్రి రోడ్డు పక్క పొలాల్లో గాయాలతో పడి ఉన్న బాలుడి ఆచూకీ లభించింది. విజయవాడ రామవరప్పాడు గణేశ్ నగర్కు చెందిన విజయ్ కుమార్ (14) గా గుర్తించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అతను తిరిగి వెళ్లలేదు. దీంతో అతని తల్లి పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాలుడిని గుర్తించారు. కాగా బాలుడు ఏలూరు ఎలా? ఎవరితో వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది.
News September 18, 2025
4,500 మందితో భద్రతా ఏర్పాట్లు: సీపీ

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు 4,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ రాజశేఖర్ తెలిపారు. సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భద్రత పర్యవేక్షణకు 1,000 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లను వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.