News March 30, 2025

ఏటూరునాగారం: గ్రూప్-1 ఫలితాల్లో 105వ ర్యాంకు

image

ఏటూరునాగారంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ కుమార్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో 105వ ర్యాంకు సాధించారు. చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఎన్నో కష్టాలను ఎదుర్కొని చదువుకున్నారు. తన ప్రతిభను నమ్ముకొని ఆత్మవిశ్వాసంతో అన్నింటిని దాటుకొని గ్రూప్-1 ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు.డీఎస్పీగా ఎంపికయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Similar News

News November 14, 2025

దూసుకెళ్తున్న నవీన్ యాదవ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఏడో రౌండ్ ముగిసేసరికి ఆయన 19వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో మూడు రౌండ్లు కౌంటింగ్ చేయాల్సి ఉంది.

News November 14, 2025

గొర్రె పిల్లల పెరుగుదల వేగంగా ఉండాలంటే..

image

గొర్రె పిల్లల పెరుగుదల వాటి జాతి, లభించే పోషకాహారంపై ఆధారపడి ఉంటుంది. పుట్టిన నెల వయసు నుంచే గొర్రె పిల్లలను కూడా తల్లులతో పాటు మేత కోసం బయటకు తీసుకెళ్తారు. ఆ సమయంలో సంపూర్ణ పోషకాహారం అందక గొర్రె పిల్లల్లో రోజువారీ పెరుగుదల 100 గ్రాములకు మించడం లేదు. అదే గొర్రె పిల్లలకు 150 రోజుల వరకు షెడ్లలో ఉంచి సంపూర్ణ ఆహారం అందిస్తే అవి రోజుకు కనీసం 175 గ్రాముల వరకు పెరుగుతాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.

News November 14, 2025

కరీంనగర్: శతాధిక వృద్ధురాలు మృతి

image

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బొజ్జ జోగవ్వ (101) అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి 11 గంటల 10 నిమిషాల సమయంలో మృతి చెందారు. ఈమెకు ఒక కొడుకు, నలుగురు మనవళ్లు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. జోగవ్వ కుటుంబ సభ్యులను పలువురు నాయకులు, గ్రామ ప్రజలు పరామర్శించారు.