News March 30, 2025

ఏటూరునాగారం: గ్రూప్-1 ఫలితాల్లో 105వ ర్యాంకు

image

ఏటూరునాగారంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ కుమార్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో 105వ ర్యాంకు సాధించారు. చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఎన్నో కష్టాలను ఎదుర్కొని చదువుకున్నారు. తన ప్రతిభను నమ్ముకొని ఆత్మవిశ్వాసంతో అన్నింటిని దాటుకొని గ్రూప్-1 ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు.డీఎస్పీగా ఎంపికయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Similar News

News October 31, 2025

అనకాపల్లి: ‘భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం’

image

భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామని అనకాపల్లి ఎంపీ సీఎం.రమేశ్ అన్నారు. పెందుర్తి పునరావాస కేంద్రంలో బాధితులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబుతో కలిసి నిత్యవసర సరుకులను శుక్రవారం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం వల్లే తక్కువ నష్టం జరిగిందన్నారు.

News October 31, 2025

రూ.కోట్లు కుమ్మరించినా చుక్క వర్షం పడలేదు

image

కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్(కృత్రిమ వర్షం) ఫ్లాప్ అయింది. ఇప్పటివరకు 3 ట్రయల్స్ నిర్వహించగా చుక్క వర్షం కూడా కురవలేదు. ఒక్కో ట్రయల్‌కి రూ.35.67 లక్షల చొప్పున రూ.1.07 కోట్లు ఖర్చయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 9 ట్రయల్స్ కోసం ప్రభుత్వం రూ.3.21 కోట్లు కేటాయించింది. లో సక్సెస్ రేట్ ఉన్న ఈ విధానానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలొస్తున్నాయి.

News October 31, 2025

REWIND: బాగారెడ్డి త్యాగం.. ఇందిరాకు భారీ మెజార్టీ

image

ఇందిరాగాంధీ గతంలో మెదక్ నుంచి పోటీకి దిగినా ప్రచారం మాత్రం చేయలేకపోయారు. దీంతో ఆమె ప్రచార బాధ్యతలను కాంగ్రెస్ పార్టీకి చెందిన బాగారెడ్డి చేపట్టారు. ఆయన మంత్రిగా ఉండి పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం సరికాదని భావించిన బాగారెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఊరూరా తిరిగి ప్రచారాన్ని అన్నీ తానై ముందుండి నడిపారు. ఈ ఎన్నికల్లో 2 లక్షలకు పైగా మెజారిటీతో ఇందిరాగాంధీ విజయం సాధించారు.