News March 30, 2025

ఏటూరునాగారం: గ్రూప్-1 ఫలితాల్లో 105వ ర్యాంకు

image

ఏటూరునాగారంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ కుమార్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో 105వ ర్యాంకు సాధించారు. చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఎన్నో కష్టాలను ఎదుర్కొని చదువుకున్నారు. తన ప్రతిభను నమ్ముకొని ఆత్మవిశ్వాసంతో అన్నింటిని దాటుకొని గ్రూప్-1 ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు.డీఎస్పీగా ఎంపికయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Similar News

News July 11, 2025

మంగనూరు గ్రామానికి నేడు వైస్ ఛాన్స్‌లర్ రాక

image

బిజినేపల్లి మండలంలోని మంగనూరులో విద్య విధానంపై సమ్మేళనం జరగనున్నది. ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.నిత్యానందరావు హాజరవుతున్నట్లు విజ్ఞాన వేదిక నిర్వాహకులు బోట్క కొండయ్య తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో సమ్మేళనం జరుగనుంది. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొఫెసర్లు సమావేశానికి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.

News July 11, 2025

మేదరమెట్లలో యాక్సిడెంట్

image

మేదరమెట్ల జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ఖాళీ అట్ట పెట్టెల లోడుతో వెళ్తున్న ఓ ఐచర్ లారీ బ్రిడ్జిపై బోల్తా పడింది. మార్టూరులోని ద్రోణాదులకు చెందిన లారీ డ్రైవర్ SK చాంద్ బాషా నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మేదరమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

News July 11, 2025

KNR ఆర్టీసీ జోనల్ హాస్పిటల్ లో అందుబాటులోకి ఎక్స్ రే సేవలు

image

ఆర్టీసీ KNR జోనల్ ఆస్పత్రిలో ఎక్స్ రే సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా. ఎ.వి గిరిసింహారావు మాట్లాడుతూ.. నిత్యం రోడ్డు మీద ప్రయాణించే డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్, వర్క్ షాపు సిబ్బంది గాయాల బారిన పడుతుంటారని అన్నారు. వాటిని నిర్ధారించడానికి ఎక్స్ రే ఉపయోగపడుతుందని అన్నారు. ఉన్నత శ్రేణి డిజిటల్ ఎక్స్ రే మెషీన్ ని అందించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.