News March 25, 2025
ఏటూరునాగారం: బోనోఫిక్స్ విక్రయిస్తున్న మహిళపై కేసు

మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై తాజుద్దీన్ హెచ్చరించారు. ఏటూరునాగారానికి చెందిన బట్టు సుజాత అనే మహిళ కంగన్ హాల్ నడుపుతూ బోనోఫిక్స్ అనే మత్తు పదార్థాన్ని విక్రయిస్తుందన్న సమాచారం మేరకు అదుపులోకి తీసుకొని ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. విద్యార్థులు, చిన్న పిల్లలకు మత్తు పదార్థాలైన బోనోఫిక్స్ విక్రయిస్తూ విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News February 23, 2026
ఏలూరు: ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 1,014 మంది గైర్హాజరు

ఏలూరు జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షలకు 17,864 మంది హాజరు కావలసి ఉండగా 16,850 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1,014 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారని వివరించారు. మొదటిరోజు పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయన్నారు. రేపటి పరీక్షకు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయంలోపు రావాలన్నారు.
News February 23, 2026
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. 888 మంది గైర్హాజరు: ఆర్ఐవో

నెల్లూరు జిల్లాలో మొదటి రోజు ఇంటర్ పరీక్ష ఎక్కడ మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ఆర్ఐవో వరప్రసాదరావు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 81 కేంద్రాలలో 27,613 మంది విద్యార్థులకు గాను 888 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు, అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు.
News February 23, 2026
పోలవరం జిల్లాలో వార్డుల విభజన ప్రక్రియ షురూ

పోలవరం జిల్లాలో స్థానిక ఎన్నికల సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో వార్డుల విభజన కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావు సోమవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 186 పంచాయతీలున్నాయన్నారు. మార్చి 9న తుది ఓటర్లు జాబితా విడుదల చేయడానికి కృషి జరుగుతుందన్నారు.
ఏప్రిల్ నెలతో సర్పంచుల పదవి కాలం ముగుస్తుందని, టెన్త్ పరీక్షలు తరువాత ఎన్నికలు జరిగే ఉందన్నారు.


