News January 27, 2025

ఏటూరునాగారం: భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆత్మహత్య

image

భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘనపురంలో జరిగింది. ఎస్ఐ తాజుద్దీన్ తెలిపిన వివరాలు.. గంజి రంజిత్ (32), స్వాతి దంపతులు. 15 రోజుల క్రితం వీరిద్దరు గొడవపడడంతో స్వాతి పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో రంజీత్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 24, 2025

రాళ్లు పెరుగుతాయా? శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

image

భూమి పుట్టుక నుంచి నేటి వరకు జరిగిన మార్పులకు రాళ్లు సజీవ సాక్ష్యాలని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లు ప్రధానంగా 3 రకాలు. అగ్నిపర్వత లావాతో ఏర్పడే ఇగ్నియస్, ఇసుక-మట్టి పొరలతో తయారయ్యే సెడిమెంటరీ, ఒత్తిడి వల్ల రూపాంతరం చెందే మెటామార్ఫిక్. రాళ్లు పెరగవని, వాతావరణ మార్పుల వల్ల అరిగిపోతాయన్నారు. ఐరన్ ఎక్కువైతే ఎర్రగా, క్వార్ట్జ్ వల్ల తెల్లగా, కార్బన్ ఉంటే ముదురు రంగులో కనిపిస్తాయి.

News December 24, 2025

నల్ల వెల్లుల్లి గురించి తెలుసా.. బోలెడు ప్రయోజనాలు

image

వెల్లుల్లి అంటే తెల్లటి రెబ్బలే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు నల్ల వెల్లుల్లి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తెల్ల వెల్లుల్లిని ఫర్మంటేషన్ ప్రక్రియ ద్వారా నల్లగా తయారు చేస్తారు. ఇది ఘాటు వాసన లేకుండా కొంచెం తీపిగా ఉంటుంది. నల్ల వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు ఒకటి రెండు రెబ్బలు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

News December 24, 2025

నల్గొండ: మున్సిపల్ పోరుకు సమాయత్తం..!

image

గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించేలా సంకేతాలు వెలువడుతున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే మున్సిపల్ పోరు జరగొచ్చనే అంచనాతో అధికార, ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నాయకులు సమాయత్తమవుతున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నికల వేడి చల్లారక ముందే జిల్లాలో మరోమారు పొలిటికల్ హీట్ పెరిగింది.