News January 27, 2025

ఏటూరునాగారం: భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆత్మహత్య

image

భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘనపురంలో జరిగింది. ఎస్ఐ తాజుద్దీన్ తెలిపిన వివరాలు.. గంజి రంజిత్ (32), స్వాతి దంపతులు. 15 రోజుల క్రితం వీరిద్దరు గొడవపడడంతో స్వాతి పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో రంజీత్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 5, 2025

పైడమ్మ జాతర రెండో రోజు.. సిద్ధమవుతున్న శిడిబండ్లు.!

image

పెడనలో పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు శుక్రవారం శిడిబండ్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతర రెండో రోజు కాపుల వీధి నుంచి విశేషంగా మొత్తం 11 శిడిబండ్లు అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధికి బయలుదేరనున్నాయి.

News December 5, 2025

గూడూరు ప్రజల సెంటిమెంట్ పట్టించుకోరా..?

image

దుగ్గరాజపట్నం పోర్టు కోసమే గూడూరును తిరుపతి జిల్లాలో కొనసాగిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. దీంతో నెల్లూరులో గూడూరు విలీనం లేదా గూడూరు జిల్లా అనేది దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. ఇక్కడి మాట తీరు, కల్చర్ అంతా నెల్లూరుకు దగ్గరగా ఉంటుంది. ఇప్పటికీ అక్కడి ప్రజలు మాది నెల్లూరేనని కొత్తవాళ్లతో పరిచయం చేసుకుంటారు. ఇంతలా అక్కడి వాళ్లు నెల్లూరుతో బంధం పెంచుకున్నారు.

News December 5, 2025

ప్రయాణికులకు చుక్కలు.. మరో 600 విమానాల రద్దు

image

ప్రయాణికులకు IndiGo చుక్కలు చూపిస్తోంది. ఇవాళ మరో 600 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇందులో ఢిల్లీలో 235, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో 100 చొప్పున ఉన్నాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు ఢిల్లీకి వచ్చే/వెళ్లే ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీటికి అవస్థలు పడుతున్నామని, రాత్రి నేలపై పడుకున్నామని వాపోతున్నారు.