News January 27, 2025

ఏటూరునాగారం: భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆత్మహత్య

image

భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘనపురంలో జరిగింది. ఎస్ఐ తాజుద్దీన్ తెలిపిన వివరాలు.. గంజి రంజిత్ (32), స్వాతి దంపతులు. 15 రోజుల క్రితం వీరిద్దరు గొడవపడడంతో స్వాతి పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో రంజీత్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 27, 2025

గుంటూరు జిల్లాలో నత్తనడకన రేషన్ కార్డుల పంపిణీ

image

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 5,99,558 కార్డులు ఉండగా వాటికి తోడు మరో 9 వేలు కొత్త కార్డులు తాజాగా ఆమోదించారు. తొలివిడతగా జిల్లాకు 5,85,615 స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ముద్రించింది. ఇప్పటివరకు 5,23,418 కార్డులను మాత్రమే పంపిణీ చేయగా, మరో 80 వేల కార్డులు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. స్మార్ట్ రేషన్ కార్డులు డీలర్లు, సచివాలయ సిబ్బంది దగ్గర పేరుకుపోయాయి.

News October 27, 2025

వైద్యురాలి ఆత్మహత్య.. సంచలన ఆరోపణలు

image

MHలో సూసైడ్ చేసుకున్న <<18107450>>వైద్యురాలిపై<<>> ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ‘గతంలో నా కూతురిని ఆమె భర్త అజింక్య(ఆర్మీ ఆఫీసర్), అత్తింటివాళ్లు చంపేశారు. కానీ సూసైడ్ చేసుకుందని లేడీ డాక్టర్ ఫేక్ పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చింది. ఆమెను ఎవరో ఒత్తిడి చేసినందుకే ఈ పని చేసింది. దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. కాగా SI గోపాల్‌తో పాటు ఓ MP తనను వేధించారంటూ సదరు వైద్యురాలు సూసైడ్ నోట్‌లో రాసిన విషయం తెలిసిందే.

News October 27, 2025

ఎన్టీఆర్: వాయిదా పడిన కేంద్ర మంత్రి నిర్మల అమరావతి పర్యటన

image

అమరావతిలో మంగళవారం జరగాల్సిన బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది. కార్యక్రమం జరిగే తదుపరి తేదీ తెలియాల్సి ఉంది. కాగా ఉద్దండరాయునిపాలెంలో 12 బ్యాంకులకు CRDA స్థలాలు కేటాయించగా..శంకుస్థాపన జరిగిన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.