News April 14, 2025

ఏటూరునాగారం: ‘మావో’లకు వ్యతిరేకంగా పోస్టర్లు!

image

ఏటూరునాగారంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివాసీ యువజన సంఘం పేరుతో ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ఆదివాసీలను అడవుల్లోకి వెళ్లకుండా బాంబులు పెట్టి అడ్డుకుంటున్నారని, ఆదివాసీల మీద ‘మావో’ల అప్రకటిత యుద్ధం ఏంటని ప్రశ్నించారు. ఆదివాసీలను చంపటం మీ సిద్ధంతమా? ఇందుకోసమేనా మీ పోరాటం? అని రాసుకొచ్చారు.

Similar News

News October 29, 2025

MHBD: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు కలెక్టర్ సూచన

image

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా తుఫానుతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు.

News October 29, 2025

ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని IMD తెలిపింది. ఏపీలోని గుంటూరు, ప్రకాశం, టీజీలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. కాగా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

News October 29, 2025

NRPT: బస్సు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

image

నారాయణపేట పట్టణానికి చెందిన అంజమ్మ, ఆదివారం పెబ్బేరు బస్టాండ్‌లో బస్సు రివర్స్ తీసుకుంటున్న క్రమంలో టైర్లు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేసి రెండు కాళ్లు తొలగించినా, శరీరం మొత్తం ఇన్ఫెక్షన్‌ కావడంతో మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.