News April 14, 2025

ఏటూరునాగారం: ‘మావో’లకు వ్యతిరేకంగా పోస్టర్లు!

image

ఏటూరునాగారంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివాసీ యువజన సంఘం పేరుతో ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ఆదివాసీలను అడవుల్లోకి వెళ్లకుండా బాంబులు పెట్టి అడ్డుకుంటున్నారని, ఆదివాసీల మీద ‘మావో’ల అప్రకటిత యుద్ధం ఏంటని ప్రశ్నించారు. ఆదివాసీలను చంపటం మీ సిద్ధంతమా? ఇందుకోసమేనా మీ పోరాటం? అని రాసుకొచ్చారు.

Similar News

News December 9, 2025

పుట్టగూడెం, మల్లన్నగూడెం మరోసారి ఏకగ్రీవం

image

గ్రామాభివృద్ధి లక్ష్యంగా రాజాపేట మండలంలోని పుట్టగూడెం, మల్లన్నగూడెం గ్రామ పంచాయతీలు ఈసారి కూడా ఏకగ్రీవమయ్యాయి. పుట్టగూడెంలో 332 మంది ఓటర్లు, మల్లన్నగూడెంలో 759 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు గ్రామాల్లో గ్రామ పెద్దలు, నాయకుల సమన్వయంతో శాంతియుతంగా ఏకగ్రీవం సాధించారు. ప్రజల ఐక్యతతో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకున్న ఈ గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి.

News December 9, 2025

వరంగల్‌లో ఉద్యోగులకు ఏసీబీ వణుకు

image

ఉమ్మడి వరంగల్‌లో ACB దాడులు పెరిగాయి. గతేడాది 16 కేసులు నమోదవగా ఈ ఏడాది ఇప్పటి వరకు 19 కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ తిమింగళం, తొర్రూర్ CI, పెద్ద వంగర తహశీల్దార్, తాజాగా HNK అడిషనల్ కలెక్టర్‌ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. DSP సాంబయ్య నేతృత్వంలో విద్యాశాఖలో 3, పోలీసు2, రవాణా2, రిజిస్ట్రేషన్2, రెవెన్యూ3, రోడ్లు1, వ్యవసాయం1, ట్రాన్స్ కో1, భగీరత1, పంచాయతీ రాజ్2, మత్స్యశాఖలో ఒకరు ACBకి చిక్కారు.

News December 9, 2025

USలో లోకేశ్ పర్యటన.. కీలక భేటీలు

image

AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్‌తో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. అలాగే ఓమిమం సంస్థ చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్‌ చొక్కలింగం కరుప్పయ్యతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.