News April 15, 2025

ఏటూరునాగారం: వరి పంటను చూసి కన్నీరు పెట్టిన రైతులు

image

ఏటూరునాగారం మండల వ్యాప్తంగా ఆదివారం కురిసిన ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో వరిపంట నేల వాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన చిన్నదుర్గయ్య అనే రైతు అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టి వరి పంటను సాగు చేశాడని, ఆదివారం వడగళ్ల వర్షం కురవడంతో వరిపంట, వడ్లు రాలిపోయాయని కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News November 17, 2025

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం.. నేడు ఏం జరగనుంది?

image

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. స్పీకర్‌పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌తో పాటు 10 మంది MLAలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను ధర్మాసనం నేడు విచారించనుంది. MLAలను విచారించేందుకు స్పీకర్‌కు మరింత సమయం ఇస్తారా? లేదా తుది నిర్ణయం తీసుకుంటారా? ఈ నెల 23న సీజేఐ గవాయ్ రిటైర్ కానున్న నేపథ్యంలో విచారణను మరో బెంచ్‌కు పంపిస్తారా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

News November 17, 2025

NLG: సన్నాల సాగుకే సై! కారణమదే…

image

జిల్లాలో రైతులు సన్నాల సాగుపై దృష్టి సారిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా సన్నాలైన చిట్టిపొట్టి, బీపీటీ, చింట్లు తదితర సన్నరకాలను సాగు చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. సన్నాలను తేమ శాతం ఎక్కువ ఉన్నా మిల్లర్లే మద్దతు ధర కంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తుండడంతో.. రైతులు సాగు చేస్తున్న వరిలో 60 శాతం వరకు సన్నాలే ఉండడం గమనార్హం. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో సాగు గణనీయంగా పెరిగింది.

News November 17, 2025

నల్గొండ: డీసీసీలపై మళ్లీ కసరత్తు..!

image

అర్ధంతరంగా ఆగిపోయిన DCC అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై TPCC మళ్లీ దృష్టి సారించింది. త్వరలోనే DCC రథసారథులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఒక్కో జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్ల నుంచి తుది అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అక్టోబర్‌లో NLG, SRPT, యాదాద్రి జిల్లాల్లో కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే.