News April 9, 2025
ఏటూరునాగారం: వారు దరఖాస్తు చేసుకోండి!

ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో పని చేస్తున్న అర్హత కలిగిన అభ్యర్థులు జులై- 2025లో ప్రైవేట్ అభ్యర్థులుగా ఐటీఐ పరీక్షలు రాసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏటూరునాగారం ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లలో 3 ఏళ్లు పైబడిన సర్వీస్ సర్టిఫికెట్, ఎంప్లాయ్ గుర్తింపు కార్డు సమర్పించి ములుగు రోడ్డు వరంగల్ కార్యాలయంలో ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 21, 2025
RR: యూరియా కావాలా? ఇలా చేయండి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా బస్తాల కోసం రైతులు Fertilizer Booking App డౌన్ లోడ్ చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. యాప్ ద్వారా యూరియా ఏ షాపులో అందుబాటులో ఉందో చూసి బుక్ చేసుకోవచ్చు. పంట నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ కొడితే OTP వస్తుంది. దాంతో లాగిన్ కావాలి. పంట వివరాలు, విస్తీర్ణం ఎంటర్ చేయాలి. బుక్ చేసిన 24 గంటల్లో ఆ షాపుకే వెళ్లి తెచ్చుకోవాలి.
News December 21, 2025
కడప: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

కడప జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. కడపలోని 47వ డివిజన్లోని కార్యక్రమాన్ని పైఫొటోలో చూడవచ్చు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?
News December 21, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.260గా ఉంది. విజయవాడలో రూ.250, విశాఖ రూ.260, కామారెడ్డి రూ.250, నంద్యాల రూ.220-250, భీమవరంలో రూ.270గా ఉంది. కిలో మటన్ రూ.800-రూ.1000 వరకు పలుకుతోంది. అటు కోడి గుడ్ల ధరలు పెరిగాయి. బహిరంగ మార్కెట్లో ఒక గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కు చేరింది. మీ ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


