News February 13, 2025

ఏడుపాయలలో వైభవంగా అమ్మవారి పల్లకి సేవ

image

ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత సన్నిధిలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకొని భక్తులు పల్లకిసేవలో పాల్గొని తరించిపోయారు.

Similar News

News December 4, 2025

అంతర్గంలో ఎయిర్‌పోర్టు స్థల పరిశీలన

image

స్థల పరిశీలన చేసేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు రామగుండం గురువారం వచ్చారు. వివిధ శాఖల అధికారులతో కలిసి అంతర్గాంలో స్థల పరిశీలన చేశారు. కాగా ఇటీవల రామగుండం ఎయిర్ పోర్టుకు సంబంధించి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.

News December 4, 2025

తల్లిపై కూతురు పోటీ.. విషాదాంతం

image

TG: రాజకీయాలు కుటుంబ సంబంధాలనూ విచ్ఛిన్నం చేస్తున్నాయి. నల్గొండ(D) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదాంతమైంది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను BRS, ఆమె కూతురు అశ్వినిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ క్రమంలో కూతురు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 4, 2025

సిరిసిల్ల: మాజీ సీఎం కే.రోశయ్యకు ఘన నివాళులు

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య వర్ధంతి వేడుకలను సిరిసిల్లలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఇతర అధికారులతో కలిసి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు.