News February 13, 2025
ఏడుపాయలలో వైభవంగా అమ్మవారి పల్లకి సేవ

ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత సన్నిధిలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకొని భక్తులు పల్లకిసేవలో పాల్గొని తరించిపోయారు.
Similar News
News November 17, 2025
భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన వినతుల పరిష్కారంలో వివిధ శాఖల అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి 140 అర్జీలు స్వీకరించారు. వీటిలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, రెవెన్యూ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 17, 2025
భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన వినతుల పరిష్కారంలో వివిధ శాఖల అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి 140 అర్జీలు స్వీకరించారు. వీటిలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, రెవెన్యూ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్.. ఆ ఇంట్లో అనాథగా మిగిలిన సిరాజ్

సౌదీలో జరిగిన యాక్సిడెంట్ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. రాంనగర్ వాసి నసీరుద్దీన్ తన ఫ్యామిలీతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. దురదృష్టవశాత్తు వెళ్లిన 18 మంది బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన కుమారుడు సిరాజ్ ఉద్దీన్ అనాథగా మిగిలాడు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కుమారుడు నిత్యం ఫ్యామిలీతో ఫోన్ కాల్స్ మాట్లాడేవాడని తెలిసింది. ప్రమాదం తెలుసుకున్న అతడు శోకసంద్రంలో మునిగిపోయాడు.


