News July 3, 2024

ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్

image

ఏడుపాయల వన దుర్గామాత ఆలయ నూతన ఇఓగా కృష్ణ ప్రసాద్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏడుపాయల దేవాదాయ శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇంచార్జీ ఈవోగా పని చేసిన వినోద్ రెడ్డిని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఏసీగా నియమించడంతో ఆయన స్థానంలో కృష్ణ ప్రసాద్‌ను నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిశారు.

Similar News

News December 3, 2025

మెదక్: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కొల్చారం, కౌడిపల్లి, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లోని 183 సర్పంచ్, 1,523 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు

News December 3, 2025

MDK: ఓటర్లను ప్రలోభపెట్టేవారిపై కఠిన చర్యలు: ఎస్పీ

image

గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా సాగేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, విభేదాలకు దూరంగా ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కొందరిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. నగదు, మద్యం పంపిణీపై కఠిన నిఘా ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు పెట్టవద్దని, యువత కేసుల్లో ఇరుక్కోకూడదని సూచించారు.

News December 3, 2025

MDK: ఓటర్లను ప్రలోభపెట్టేవారిపై కఠిన చర్యలు: ఎస్పీ

image

గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా సాగేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, విభేదాలకు దూరంగా ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కొందరిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. నగదు, మద్యం పంపిణీపై కఠిన నిఘా ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు పెట్టవద్దని, యువత కేసుల్లో ఇరుక్కోకూడదని సూచించారు.