News April 25, 2024
ఏడు గంటల ఆలస్యంగా నడుస్తున్న బెనారస్ రైలు

రేపు తెల్లవారుజామున 4.20 గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం – బనారస్ ఎక్స్ప్రెస్ రైలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. లింక్ రైలు రాక ఆలస్యం వలన 7 గంటలు ఆలస్యంగా 11.20 గంటలకు విశాఖలో బయలుదేరుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు దీని గమనించి ప్రధానంగా తమ ప్రయాణ సమయాన్ని మార్చుకోవాలని సూచించారు.
Similar News
News December 20, 2025
మధురవాడలో తెల్లవారుజామున యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

మధురవాడలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భీమిలి మండలం పెద్దవీధికి చెందిన పూసర్ల లక్ష్మణరావు (79) అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణరావు వల్లినగర్లోని బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం తెల్లవారుజామున 5:30 గంటలకు జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ జంక్షన్ సమీపంలో సర్వీస్ రోడ్డులో వెళుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 20, 2025
విశాఖ సిటీ పోలీస్ వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం

విశాఖపట్నం సిటీ పోలీస్ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు చేరువయ్యింది. 95523 00009 నంబర్కు “Hi” అని మెసేజ్ పంపి ఈ-చలాన్ చెల్లింపులు, ఎఫ్.ఐ.ఆర్ డౌన్లోడ్, కేసు స్టేటస్ వంటి సేవలను మీ ఫోన్ నుండే పొందవచ్చు. పారదర్శకత, వేగవంతమైన సేవల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పోలీసులు తెలిపారు. తక్షణ సహాయం కోసం ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
News December 20, 2025
అదుపుతప్పిన నేవి ప్యారాచూట్.. కోరమాండల్లో ఉద్యోగి ల్యాండ్

నేవీ ఉద్యోగి పారాచూట్పై ఐఎన్ఎస్ డేగా నుంచి ఎగురుతూ అదుపుతప్పి కోరమండల్ పరిశ్రమ ఆవరణలో దిగిపోవడంతో సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపంతో కోరమండల్ గేట్ నెంబర్ 10 వద్ద ఉద్యోగి దిగిపోవడంతో కంగారుపడిన సెక్యూరిటీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగి ఐడీ కార్డు చూపించడంతో నేవీ అధికారులకు అప్పగించారు.


