News March 25, 2024
ఏడు రోజుల లక్ష్యం రూ.75.74 కోట్లు

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో ఏడు రోజుల్లో రూ.75.74 కోట్ల వసూలు లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది మొత్తం వసూళ్ల లక్ష్యం రూ.130.02 కోట్లు కాగా ఇప్పటికి రూ.54.,28 కోట్లు వసూలు చేశారు. పన్నులు చెల్లించాలని కోరుతూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు.
Similar News
News December 10, 2025
కోవూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు శిక్ష

కోవూరు పరిధిలో నమోదైన పోక్సో కేస్లో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సీపీరెడ్డి సుమ మంగళవారం తీర్పునిచ్చారు. 2021 MAR. 21న మహిళా పోలీస్ స్టేషన్లో కోవూరు(M)నికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన రాయదుర్గం వెంకటేశ్వర్లు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
News December 10, 2025
నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.
News December 10, 2025
నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.


