News September 8, 2024

ఏన్కూరు: పొంగి పొర్లుతున్న వాగులు.. రాకపోకలకు ఆటంకం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. తీగల బంజారా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్లిపాడు నుంచి కొత్తగూడెం వెళ్లాలనుకునే ప్రయాణికులు తల్లాడ వైపుగా వెళ్లాలని పోలీసు అధికారులు చెప్పారు. మరొకవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Similar News

News November 24, 2025

రేపు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు: భట్టి

image

రేపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సీఎస్ కే.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. చీరల పంపిణీ, స్కాలర్‌షిప్‌లు, పీఎంఏవై అంశాలపై చర్చించారు.

News November 24, 2025

KMM: సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ రాక ఆందోళన

image

ఖమ్మం జిల్లాలో సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు రెండేళ్లుగా పెన్షన్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు మంజూరు కాకపోగా, తీసుకున్న సర్టిఫికెట్ల గడువు ముగిసిపోతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన వికలాంగులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

News November 24, 2025

ఖమ్మం: త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు

image

అర్హులైన రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ పథకం కింద పెట్టుబడి సాయం త్వరలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భూమి ఉన్న రైతులతో పాటు, భూమి లేని వ్యవసాయ కార్మికులకూ ఎకరానికి సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఈ సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో డబ్బులు జమ అవుతాయని మంత్రి భరోసా ఇచ్చారు.