News November 11, 2024

ఏపీఎస్ ఆర్టీసీకి ‘స్కోచ్’ అవార్డు.. మంత్రి హర్షం

image

ఏపీఎస్ ఆర్టీసీకి మరోసారి ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డు రావడంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని, ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డును దక్కించుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత, డిజిటల్ టికెట్ల జారీ వల్ల అవార్డు దక్కిందన్నారు.

Similar News

News December 7, 2025

మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి

image

మహానటి సావిత్రి పేరుతో ఆమె జన్మస్థలమైన గుంటూరు జిల్లా చిర్రావూరులో కళ్యాణ మందిరం నిర్మించనున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. NTPC వారి సీఎస్ఆర్ నిధులు కింద రూ. 2కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో తాను తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో చిర్రావూరులో సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు.

News December 7, 2025

కృష్ణా: స్క్రబ్ టైఫస్‌తో వ్యక్తి మృతి

image

ఉయ్యూరు మండలం ముదునూరుకి చెందిన శివశంకర్‌ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. ఈ నెల 2న శాంపిల్స్ తీసుకోగా, రిపోర్ట్ రాకముందే 4వ తేదీన ఆయన మృతి చెందారు. శనివారం వచ్చిన రిపోర్టుల్లో ఆయనకు పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో జిల్లా వైద్య బృందం సర్వే చేపట్టింది.

News December 6, 2025

కృష్ణా జిల్లాలో 12 స్క్రబ్ టైఫస్ పాజిటీవ్ కేసులు: కలెక్టర్

image

జిల్లాలో 12 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈ కేసులు నమోదయ్యాయన్నారు. వ్యవసాయ పనులు చేసుకునే గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుందన్నారు. అనుమానిత, ధృవీకృత కేసులపై ప్రత్యేకంగా ఇంటింటి సర్వేల ద్వారా పర్యవేక్షిస్తునట్లు తెలిపారు.