News July 30, 2024

ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.!

image

వాట్సాప్‌లకు వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల మొబైల్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రకాశం పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి సారించారు. ఈ మేరకు వారు విడుదల చేసిన ప్రకటన ఆధారంగా.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసి సైబర్ నేరాల బారిన పడవద్దన్నారు. ఏవైనా సైబర్ ఫిర్యాదులను 1930కు చేయాలని సూచించారు.

Similar News

News December 17, 2025

గిద్దలూరు: దిగువ మెట్ట అటవీ ప్రాంతంలో లారీ ప్రమాదం..

image

గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం ఎస్‌–టర్నింగ్ వద్ద లారీ ప్రమాదం జరిగింది. మార్కాపురం నుంచి బళ్లారి వెళ్తున్న పత్తి లోడ్ మినీ లారీ అదుపుతప్పి కింద పడింది. డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు.

News December 17, 2025

ఒంగోలులో ట్రాఫిక్ పోలీస్ వినూత్న ప్రచారం

image

ఒంగోలులో ట్రాఫిక్ సీఐ జగదీశ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం సాయంత్రం హెల్మెట్ ధారణపై వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధారణపై విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులోని బస్టాండ్ సమీపంలో హెల్మెట్ ధారణ పాటించిన బైకర్స్‌కు చాక్‌లెట్లు అందించారు. పలువురికి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు.

News December 17, 2025

ప్రకాశం జిల్లాలో 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: జేసీ

image

జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్లో ఈనెల 16వ తేదీ వరకు 212 మంది రైతుల నుంచి రూ.3.99 కోట్ల విలువగల 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ చెప్పారు. మంగళవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో జేసి మాట్లాడుతూ.. ఇప్పటివరకు రూ.3.98 కోట్లను 211 మంది రైతులకు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన డబ్బులను తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్ నందు జమ చేయడం జరుగుతుందన్నారు.