News January 6, 2025
ఏపీని అగ్రగామిగా నిలపడమే చంద్రబాబు సంకల్పం: ఉమా
ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే సీఎం చంద్రబాబు సంకల్పం అని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆదివారం ట్వీట్ చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా సీఎం ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని Xలో పేర్కొన్నారు.
Similar News
News January 15, 2025
నందిగామలో దారుణ హత్య
నందిగామ మండలం ఐతవరంలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఐతవరం గ్రామం బీసీ కాలనీలో చింతల నాగేంద్రమ్మ (33) అదే గ్రామానికి చెందిన తోగటి హనుమంతరావుతో ఏడాదిగా సహజీవనం చేస్తోంది. కాగా వీరు కొంతకాలంగా తరచుగా గొడవపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాగేంద్రమ్మను హనుమంతరావు హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 15, 2025
విజయవాడ: ప్రత్యేక రైళ్లు ఏర్పాటు
ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- సికింద్రాబాద్(SC) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08533 VSKP- SC, నం.08537 VSKP- SC రైళ్లను బుధవారం నడుపుతామని, ఈ రైళ్లలో 9 అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయన్నారు. నేడు నం.08533 రైలు మధ్యాహ్నం 3.30కి, నం.08537 రైలు రాత్రి 11.30కి విజయవాడ చేరుకుంటాయన్నారు.
News January 15, 2025
రూ.255 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేశాం: సుజనా
అమరావతి రైతులకు పెండింగ్ కౌలు నగదు విడుదల చేసిన NDA కూటమి ప్రభుత్వం వారింట సంతోషాలు నింపిందని విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి మంగళవారం ట్వీట్ చేశారు. జగన్ హయాంలో పెండింగ్లో ఉంచిన కౌలు నగదు ఒకేసారి రూ.255 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన వారికి న్యాయం చేయటం కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యం అని సుజనా స్పష్టం చేశారు.