News December 17, 2024
ఏపీపీఎస్సీ పరీక్షలకు రంగం సిద్ధం: రెవెన్యూ అధికారి
ఏపీపీయస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలు డిసెంబరు 18 నుంచి 23 వరకు జరగనున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. భీమవరం డీఎన్ఆర్ అటానమస్ విభాగంలో ఆరు రోజులు పాటు పరీక్షలు జరగనున్నాయని, డిసెంబర్ 20 తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీలో, డిసెంబర్ 22 మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో డిపార్ట్మెంట్ పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News January 16, 2025
ప.గో: మూడు రోజులు…రూ.1000 కోట్లు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన కోడి పందాలు కూడా ముగిశాయి. ఈసారి కోడిపందాలు భారీ స్థాయిలో జరిగాయి. మొత్తం 3 రోజులుగా కోడిపందాలు, గుండాట, పేకాట మొత్తం కలిపి సుమారు రూ.1000 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు.
News January 15, 2025
ప.గో : పందేలలో పచ్చకాకిదే హవా
ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం కుక్కుట శాస్త్రం ఉందని పందెం రాయుళ్లు చెబుతున్నారు. మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు పందెంరాయుళ్లు చెబుతున్నారు. దీంతో కుక్కుట శాస్త్రంలో అవగాహన ఉన్నవాళ్లు మంగళవారం అంతా పచ్చకాకి కోడి పుంజుల హవానే కొనసాగిందని అంటున్నారు.
News January 14, 2025
కొయ్యలగూడెం: మేక మాంసానికి కేజీ కోడి మాంసం ఫ్రీ
కొయ్యలగూడెం పట్టణంలోని టీపీ గూడెం రోడ్డులోని ఓ మాంస కొట్టు వ్యాపారి భారీ ఆఫర్ ప్రకటించారు. రేపు కనుమ సందర్భంగా కిలో మేక మాంసం రూ.800కు కొనుగోలు చేసిన వారికి కిలో కోడి మాంసం ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుందన్నారు.