News April 5, 2025

ఏపీలో ఒకే ఒక్కడు.. అది మన కడపోడే

image

కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన నాగరాజు అరుదైన అవకాశాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కూటమి ప్రభుత్వం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌లను ప్రకటించింది. అందులో 31 టీడీపీ, 6 జనసేన, బీజేపీకి ఒకటి కేటాయించింది. ఇందులో బీజేపీ తరఫున యర్రగుంట్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా రామిరెడ్డికి ఈ అవకాశం లభించింది. దీంతో ఆయనకు బీజేపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపాయి.

Similar News

News April 8, 2025

ఒంటిమిట్ట: కళ్యాణోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఎక్కడా ఇబ్బందులు జరగకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

News April 8, 2025

అరటి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి సవిత

image

ఇటీవల కురిసిన వర్షానికి అరటిపంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జేసీ అతిధి సింగ్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించే విధంగా నివేదికలు తయారు చేయాలని సూచించారు.

News April 8, 2025

ఒంటిమిట్ట: రాములోరి కళ్యాణానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు

image

ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి టీటీడీ ఈవో 11న జరగబోయే కళ్యాణ వేడుక ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు రానున్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు.

error: Content is protected !!