News May 4, 2024

ఏపీలో భూహక్కు చట్టంతో భూ దోపిడీ : సీపీఐ  కె.రామకృష్ణ

image

ఏపీలో భూ హక్కు చట్టంతో రైతుల భూములు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం సిగ్గుచేటన్నారు. వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని జనం ఇంటికి పంపడం ఖాయమని ధ్వజమెత్తారు. తిరుపతిలో సీపీఐ తరుఫున ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Similar News

News January 22, 2026

చిత్తూరు: పక్క జిల్లాలోకి మారిన పోలీస్ స్టేషన్లు.!

image

పుంగనూరు నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్లను అన్నమయ్య జిల్లాలోకి కలుపుతూ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విజయ్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మండలాలలోని స్టేషన్లను మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో చేర్చారు. ఇది డిసెంబర్ 31 నుంచి అమలులోకి వచ్చినట్లు భావించాలని పేర్కొన్నారు.

News January 22, 2026

చిత్తూరు: 71 సెంటర్లలో ఇంటర్ ప్రాక్టికల్స్

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణపై తన కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష చేశారు. 71 సెంటర్లలో నిర్వహించే పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 11వేల మంది హాజరవుతారని చెప్పారు.

News January 22, 2026

చిత్తూరు: 71 సెంటర్లలో ఇంటర్ ప్రాక్టికల్స్

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణపై తన కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష చేశారు. 71 సెంటర్లలో నిర్వహించే పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 11వేల మంది హాజరవుతారని చెప్పారు.