News August 28, 2024

ఏపీలో రూ.1,040 కోట్ల పన్ను ఎగవేత

image

AP CGST ఆడిట్‌ కమిషనరేట్‌ పరిధిలోని అనుమానస్పద వ్యాపార సంస్థల్లో చేపట్టిన ఆడిట్‌ తనిఖీల్లో రూ.1,040కోట్ల పన్ను ఎగవేతను గుర్తించినట్లు ఏపీ సీజీఎస్టీ ఆడిట్‌ కమిషనర్‌ పులపాక ఆనంద్‌కుమార్‌ తెలిపారు. వైజాగ్,గుంటూరు,తిరుపతి సర్కిళ్ల పరిధిలో ఈ ఏడాది జులై వరకు మొత్తం 370 అనుమానస్పద వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసి రూ.108కోట్లను రికవరీ చేశామన్నారు. తిరుపతిలోని సీజీఎస్టీ ఆడిట్‌ కార్యాలయాన్ని సందర్శించారు.

Similar News

News November 25, 2025

అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం

image

తమిళనాడులోని అరుణాచల ఆలయంలో కార్తీక దీపోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 10 రోజులు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో ప్రధానమైన మహాదీప దర్శన వేడుకలు డిసెంబర్ 3న జరగనున్నాయి. ఆరోజు తెల్లవారుజామున 4గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వేడుకలకు 40లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

News November 25, 2025

అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం

image

తమిళనాడులోని అరుణాచల ఆలయంలో కార్తీక దీపోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 10 రోజులు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో ప్రధానమైన మహాదీప దర్శన వేడుకలు డిసెంబర్ 3న జరగనున్నాయి. ఆరోజు తెల్లవారుజామున 4గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వేడుకలకు 40లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

News November 25, 2025

5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

image

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.