News January 20, 2025

ఏపీ ఖజానా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా చంద్ర శేఖర్

image

ఆంధ్రప్రదేశ్ ఖజానా, లెక్కల సర్వీసెస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా శాఖ కార్యవర్గ ఎన్నికలను ఆదివారం జిల్లా ఖజానా కార్యాలయంలో నిర్వహించారు. అసోసియేషన్ ఎన్నికల అధికారి ప్రభు దాస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా హెచ్.చంద్ర శేఖర్ (సీనియర్ అకౌంటెంట్), జిల్లా కార్యదర్శిగా వై.శ్రీనివాస రాజు (సీనియర్ అకౌంటెంట్), తదితర సభ్యులను ఎన్నుకున్నారు.

Similar News

News October 23, 2025

3వ విడత రీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి: సీసీఎల్ఏ

image

సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రకారం ఇళ్లు లేని వారికి ఇళ్లు కల్పించడానికి అన్ని జిల్లాల కలెక్టర్‌లు చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ జయలక్ష్మి ఆదేశించారు. 3వ విడత రీ సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని, హౌసింగ్ సంబంధిత సమస్యలను సమీక్షించాలని సూచించారు. దీనికి సంబంధించిన నివేదిక సమర్పిస్తామని కర్నూలు కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు.

News October 22, 2025

2 కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు: జిల్లా జడ్జి

image

రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది పేర్కొన్నారు. బుధవారం కర్నూలు, నంద్యాల కలెక్టర్‌లు, ఎస్పీలతో విక్టిమ్ కాంపెన్సేషన్, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ, హిట్ అండ్ రన్ కేసులపై సమీక్ష నిర్వహించారు. రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేశారు. ఆధార్ లేని 125 అనాథ పిల్లల్లో 56 మందికి ఆధార్ కార్డులు జారీ చేశారు.

News October 22, 2025

చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేసి చట్టవిరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. సంస్థలకు వచ్చిన నిధులు, ఖర్చులు, మౌలిక వసతుల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల నియంత్రణపై చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.