News December 5, 2024

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం

image

ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ నడుమ అవగాహన ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం ఏఐ రంగంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఏపీలోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

Similar News

News November 14, 2025

మాతృ మరణాల నివారణే ప్రధాన లక్ష్యం: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా అన్ని వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. హైరిస్క్ గర్భిణులను నిరంతరం పర్యవేక్షించి, సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. ఆరోగ్య పరీక్షలు, పౌష్టికాహారం, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించాలన్నారు. సమష్టిగా కృషి చేసి మాతృ మరణాలు నివారించాలని ఆమె పిలుపునిచ్చారు.

News November 13, 2025

10 రోజుల్లో పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి: APTF

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, ప్రదానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల పీఎఫ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఇదే అంశంపై జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బసవలింగారావు, ఖాలీద్ గురువారం జడ్పీ ఛైర్‌పర్సన్ క్రిస్టీనాను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

News November 13, 2025

GNT: 15వ ఆర్థిక సంఘం సాధారణ నిధులపై సమీక్ష

image

గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల వివరాల గురించి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కత్తెర హెనిక్రిస్టినా అధ్యక్షత వహించి మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన వర్క్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఛైర్‌పర్సన్ సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో కృష్ణ, అధికారులు పాల్గొన్నారు.