News April 29, 2024
ఏపీ సెట్ ప్రవేశ పరీక్షకు 79.25% హాజరు

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీసెట్ 2024 ప్రవేశ పరీక్షకు విశాఖ జిల్లాలో 79.25% హాజరు నమోదైనట్లు మెంబర్ సెక్రటరీ ఆచార్య జి.ఎం.జె రాజు తెలిపారు. పరీక్షకు 9311 మంది దరఖాస్తు చేసుకోగా 7379 మంది హాజరయ్యారు. 1932 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. విశాఖ నగరంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.
Similar News
News April 12, 2026
విశాఖ: రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 12, 2026
విశాఖ ప్రజలకు గమనిక.. ఈ నెల 30 వరకే గడువు

2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీను ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం పొడిగించిందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను ఈ నెల 30లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటును ఇవ్వనున్నట్లు తెలిపారు.
News April 12, 2026
విశాఖ ప్రజలకు గమనిక.. ఈ నెల 30 వరకే గడువు

2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీను ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం పొడిగించిందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను ఈ నెల 30లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటును ఇవ్వనున్నట్లు తెలిపారు.


