News March 29, 2025
ఏప్రిల్ 1 వరకు నాగర్కర్నూల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

నాగర్ కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ శాఖ శనివారం విడుదల చేసిన రిపోర్ట్లో ఏప్రిల్ ఒకటి వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగనుంది. 40 డిగ్రీల వరకు జిల్లాలో ఉష్ణోగ్రతల నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.
Similar News
News December 19, 2025
TU: డిగ్రీ విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్

టీయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్ ఇచ్చినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 2016 నుంచి 2020 వరకు విద్యనభ్యసించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల విద్యార్థులు 1,2,3,4,5,6 సెమిస్టర్ పరీక్షలు రాసుకోవచ్చు అని వెల్లడించారు. జనవరి 3 లోపు ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.
News December 19, 2025
కడపలో వారి గన్ లైసెన్సుల రద్దు..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కడప జిల్లాలోని గన్ లైసెన్స్లపై దృష్టి సారించారు. లైసెన్స్ పొందిన వారి గురించి ఆరా తీస్తున్నారు. వారిపై కేసుల వివరాలు, నేర చరిత్రను పరిశీలిస్తున్నారు. జిల్లాలో సుమారు 850 దాకా గన్ లైసెన్స్లు ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సమస్యలు సృష్టించే వారి గన్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయనున్నారు.
News December 19, 2025
విజయవాడలో హత్యకు గురైన నర్సీపట్నం వాసి

నర్సీపట్నం మండలం నీలంపేట గ్రామానికి చెందిన పలక తాతాజీ విజయవాడలో గురువారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. అతని కుమారుడు శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనికి వెళ్లిన తాతాజీ ఇంటికి రాలేదు. స్నేహితులతో కలిసి గాలించగా చిట్టినగర్ స్వరంగం ప్రాంతం వద్ద రక్తపు మడుగుల్లో, కత్తిగాట్లుతో మృతి చెంది ఉన్నాడు. తండ్రి అనుమానాస్పద మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు.


