News March 30, 2024

ఏప్రిల్ 20న పెళ్లి..ఇంతలోనే వాలంటీర్ మృతి

image

త్వరలో పెళ్లి కావాల్సిన వాలంటీర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన రేగడి మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా, కోయకొండ గ్రామానికి చెందిన షణ్ముఖరావ్ గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 20 వివాహం ఖాయమైంది. పెళ్లి పత్రికల పంపిణీ కోసం ఇద్దరు స్నేహితులతో బంధువుల ఇంటికి బయలుదేరాడు. కె. అగ్రహారం సీమపంలో లారీని తప్పించబోయి ఆటోను డీ కొట్టడంతో షణ్ముఖరావ్ మృతి చెందాడు.

Similar News

News January 22, 2025

VZM: ఎస్పీకి హోం మంత్రి అభినందన..ఎందుకో తెలుసా?

image

జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆమె స్థానిక పోలీస్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఆరు మాసాల పసిబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడికి ఐదు నెలల్లో శిక్ష పడేలా చర్యలు చేపట్టినందుకు ఎస్పీని అభినందించారు. గంజాయి నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

News January 21, 2025

VZM: జిల్లాలో 80 శాతం రహదారులు పూర్తి చేశాం: మంత్రి అనిత

image

గుంతలు లేని రహదారుల కార్యక్రమం కింద జిల్లాలో 80 శాతం రహదారులను పూర్తి చేసామని జిల్లా ఇన్‌ఛార్జ్ మినిస్టర్ అనిత అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ నెలాఖరికి 100% రహదారులు పూర్తి చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత NREGS కింద రాష్ట్రంలో వందల కోట్లతో పనులు చేపట్టామన్నారు. రెవెన్యూ సిబ్బంది ఎవరికీ కొమ్ము కాయకుండా పనిచేయాలన్నారు.

News January 21, 2025

బొత్సకు హోం మంత్రి అనిత కౌంటర్

image

శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత<<15209881>> కౌంటర్<<>> ఇచ్చారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రామతీర్థం ఘటనలో నిందితుడికి, సాక్షులకు తేడా మాజీ మంత్రికి తెలియడం లేదన్నారు. ఘటనలో సాక్షిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని స్పష్టం చేశారు. తప్పు చేయని వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు.