News March 27, 2025

ఏప్రిల్ 3న వేములవాడకు రానున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

image

ఏప్రిల్ 3వ తేదీన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలా దేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట ప్రవీణ్ వచ్చే నెల 3వ తేదీన జిల్లాలోని వేములవాడకు సాయంత్రం చేరుకుంటారు. 4వ తేదీన ఉదయం 6 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

Similar News

News December 22, 2025

నేరాల నియంత్రణలో రాచకొండ పోలీసులు సక్సెస్: సీపీ

image

విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్, టెక్నాలజీ సమన్వయంతో అమలు చేసిన VQT వ్యూహం నేరాల నియంత్రణలో ఫలితాలిచ్చిందని సీపీ సుధీర్ బాబు అన్నారు. అన్యువల్ ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 6,188 నివారణ అరెస్టులు చేపట్టగా, నమోదైన కేసుల్లో 78 శాతం పరిష్కార రేటు సాధించామన్నారు. మహిళలు, బలహీన వర్గాల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.

News December 22, 2025

గడువులోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్

image

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తహశీల్దార్లను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని రెండు.నియోజకవర్గాల పురోగతిని గణాంకాల ఆధారంగా సమీక్షించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలు, సమానమైన వివరాలు, బ్లర్ ఫొటోలు వంటి లోపాలను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

News December 22, 2025

అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: SP

image

PGRS అర్జీల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని SP బిందుమాధవ్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్వయంగా 27 మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ఆయా అర్జీలను సంబంధిత అధికారులకు పంపి, గడువులోగా పరిష్కరించాలని సూచించారు. చట్టపరిధిలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.