News March 30, 2025
ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి మూల్యాంకన: DEO

పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనను మొత్తం 1,032 మంది సిబ్బంది నిర్వహిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు.ఏప్రిల్ 3 తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే మూల్యాంకనం రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు.111 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 651 మంది ఎగ్జామినర్లు, 270 మంది స్పెషల్ అసిస్టెంట్లను ఇందు కోసం నియమించామన్నారు. ఒక ఎగ్జామినర్ ప్రతిరోజు 40 పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు.
Similar News
News December 9, 2025
విచిత్రమైన కారణంతో డివోర్స్ తీసుకున్న జంట!

వంటల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకపోవడంపై మొదలైన గొడవ 22 ఏళ్ల వివాహబంధాన్ని ముంచేసింది. ఈ విచిత్రమైన ఘటన అహ్మదాబాద్లో(GJ) జరిగింది. 2002లో పెళ్లి చేసుకున్న ఓ జంట 2013లో విడాకుల కోసం కోర్టుకెక్కింది. పూజల కారణంతో భార్య ఉల్లి, వెల్లుల్లిని వంటల్లో నిషేధించగా భర్త వేయాలని పట్టుబట్టాడు. దశాబ్ద కాలం పోరాటం తర్వాత 2024లో కోర్టు విడాకులను ఖరారు చేసింది. తాజాగా హైకోర్టు భార్య పిటిషన్ను కొట్టేసింది.
News December 9, 2025
‘CMR రైస్ సరఫరా గడువులోగా పూర్తి చేయాలి’

రబీ సీజన్కి సంబంధించి సీఎంఆర్ రైస్ సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి సీఎంఆర్ రైస్ డెలివరీపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోజువారీ రిజిస్టర్లు నమోదు చేయాలని, ఎలాంటి నాణ్యతా లోపాలు రాకుండా చూసుకోవాలన్నారు.
News December 9, 2025
ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారా?

ప్రస్తుతకాలంలో దంపతులిద్దరూ ఉద్యోగం చేయడం కామన్ అయిపోయింది. అయితే ఇలాంటి జంటలు కొన్ని టిప్స్ పాటిస్తే క్వాలిటీ టైం గడపొచ్చంటున్నారు నిపుణులు. ఇద్దరూ ఖాళీగా ఉండే సమయాన్ని గుర్తించి ఫోన్, టీవీ పక్కన పెట్టి భాగస్వామితో గడపాలి. దీనివల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ దెబ్బతినకుండా ఉంటుంది. లేదంటే ఇంటి పనీ, వంటపని కలిసి జంటగా చేసుకోవాలి. కలిసి గడపలేకపోతున్నామన్న ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.


