News March 30, 2025

ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి మూల్యాంకన: DEO  

image

పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనను మొత్తం 1,032 మంది సిబ్బంది నిర్వహిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు.ఏప్రిల్ 3 తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే మూల్యాంకనం రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు.111 మంది చీఫ్ ఎగ్జామినర్‌లు, 651 మంది ఎగ్జామినర్‌లు, 270 మంది స్పెషల్ అసిస్టెంట్లను ఇందు కోసం నియమించామన్నారు. ఒక ఎగ్జామినర్ ప్రతిరోజు 40 పేపర్‌లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు.  

Similar News

News November 13, 2025

గాంధారిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. గాంధారిలో 10.8°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మన్ దేవిపల్లి 11, ఎల్పుగొండ,బీబీపేటలో 11.1, నస్రుల్లాబాద్,లచ్చపేటలో 11.2, రామారెడ్డి,రామలక్ష్మణపల్లిలో 11.4, సర్వాపూర్ 11.5, డోంగ్లి 11.6, మేనూర్ 11.8, ఇసాయిపేట,జుక్కల్‌లో 11.9, బీర్కూర్ 12°Cలుగా నమోదయ్యాయి.

News November 13, 2025

ALERT: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?

image

ఢిల్లీ పేలుడులో ‘సెకండ్ హ్యాండ్ i20 కారు’ కీలకంగా మారింది. ఇలాంటి కేసుల్లో ఇరుక్కోకూడదంటే కొన్ని <<7354660>>జాగ్రత్తలు<<>> తీసుకోవాలి. కారు నంబర్‌పై కేసులు, ఛలాన్లతో పాటు ఫినాన్స్ పెండింగ్ ఉందేమో చూడాలి. ముఖ్యంగా అన్ని డాక్యూమెంట్లు ఉండాలి. ఆ వాహనం ఆధార్‌తో లింకై ఉండాలి. నేరుగా కాకుండా థర్డ్ పార్టీ ద్వారా కొంటే ఆ బాధ్యత వారిపైనా ఉంటుంది. కొన్నా, అమ్మినా RTOలో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్ తప్పనిసరి.

News November 13, 2025

340పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. BE, B.Techలో 60% మార్కులతో ఉత్తీర్ణులైన, 25ఏళ్లలోపు వారు అర్హులు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1180, SC, ST, PwBDలకు ఫీజు లేదు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: bel-india.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.