News March 30, 2025

ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి మూల్యాంకన: DEO  

image

పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనను మొత్తం 1,032 మంది సిబ్బంది నిర్వహిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు.ఏప్రిల్ 3 తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే మూల్యాంకనం రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు.111 మంది చీఫ్ ఎగ్జామినర్‌లు, 651 మంది ఎగ్జామినర్‌లు, 270 మంది స్పెషల్ అసిస్టెంట్లను ఇందు కోసం నియమించామన్నారు. ఒక ఎగ్జామినర్ ప్రతిరోజు 40 పేపర్‌లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు.  

Similar News

News October 15, 2025

బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంలో విచారణ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించనుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9పై హైకోర్టు ఇటీవల స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ సర్కార్ సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

News October 15, 2025

భువనగిరి: దారుణం.. విద్యార్థినిని చితకబాదిన టీచర్

image

భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం జరిగింది. క్లాస్ టీచర్ ఒక విద్యార్థినిని చితకబాదాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. యాజమాన్యం జోక్యం చేసుకుని, సదరు ఉపాధ్యాయుడితో క్షమాపణ చెప్పించి గొడవ సద్దుమణిగేలా చేసింది. మంచి ర్యాంకుల కోసం కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాయని పలువురు జిల్లా వాసులు అంటున్నారు.

News October 15, 2025

కల్తీ మద్యం.. ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలు

image

AP:* క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేశాకే మద్యం అమ్మాలి
* ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా సీసాపై కోడ్ స్కాన్ చేయాలి
* విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించినట్లు ప్రతి దుకాణం, బార్ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలి
* ప్రతి దుకాణం, బార్‌లో డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు
* మద్యం దుకాణాల్లో ర్యాండమ్‌గా ఎక్సైజ్ శాఖ తనిఖీలు
* నకిలీ మద్యం గుర్తిస్తే షాపు లైసెన్స్ రద్దు