News March 28, 2025

ఏప్రిల్ 5లోపు అప్లై చేసుకోండి: భద్రాద్రి కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలోని బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ (EBC, EWS) నిరుద్యోగులైన యువతీ, యువకులు రాజీవ్ యువ వికాసం పథకానికి ఏప్రిల్‌ 5లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి బీసీ, ఎంబీసీ కులాలకు చెందిన వారు అర్హులని, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత ఆర్థిక, స్వయం ఉపాధిని పెంపొందించుకునే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు.

Similar News

News November 18, 2025

సిరిసిల్లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

రాజన్న జిల్లా జిన్నింగ్ మిల్ నిర్వాహకులు ప్రభుత్వ అధికారులతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ప్రతి మిల్లులో పత్తి కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతించాలనే ప్రధాన డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లు మిల్లర్ల అసోసియేషన్ తెలిపింది. దీంతో జిల్లాలో మంగళవారం సాయంత్రం పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.

News November 18, 2025

SRCL: ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు

image

జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ, సేకరించిన ధాన్యం మిల్లులకు తరలింపు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు.

News November 18, 2025

పుట్టపర్తికి సచిన్ టెండూల్కర్

image

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ పుట్టపర్తికి చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్‌ను మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొంతసేపు వారు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.