News March 28, 2025

ఏప్రిల్ 5లోపు అప్లై చేసుకోండి: భద్రాద్రి కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలోని బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ (EBC, EWS) నిరుద్యోగులైన యువతీ, యువకులు రాజీవ్ యువ వికాసం పథకానికి ఏప్రిల్‌ 5లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి బీసీ, ఎంబీసీ కులాలకు చెందిన వారు అర్హులని, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత ఆర్థిక, స్వయం ఉపాధిని పెంపొందించుకునే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు.

Similar News

News December 13, 2025

NRPT: 700 మంది పోలీసులతో బందోబస్తు: ఎస్పీ

image

నారాయణపేట జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల కోసం పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. శనివారం ఓ ఫంక్షన్ హాలులో పోలీసులకు బందోబస్తుపై ఆయన సూచనలు ఇచ్చారు. 700 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు విధులు నిర్వహించి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

News December 13, 2025

అల్లూరి జిల్లాలో నవోదయ పరీక్షకు 1,352 మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో నవోదయ ఎంట్రన్స్ పరీక్షలకు 1,352మంది గైర్హాజరు అయ్యారని పరీక్షల కన్వీనర్ ప్రసాద్ తెలిపారు. 16పరీక్ష కేంద్రాల్లో 6వ తరగతి ప్రవేశానికి మొత్తం 3,493మంది హాజరు కావాల్సి ఉండగా 2,141మంది పరీక్షలు రాశారని తెలిపారు. అడ్డతీగలలో రెండు పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. అన్ని చోట్ల ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయన్నారు.

News December 13, 2025

VKB: రేపే ఎన్నికలు.. అధికారులకు ఎస్పీ ఆదేశాలు

image

రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ స్నేహమెహ్రా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రజలందరూ శాంతియుతంగా, స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల బందోబస్తుపై సూచనలు చేశారు.