News January 27, 2025
ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సురేంద్ర

విశాఖపట్నంలో జరుగుతున్న ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పత్తికొండకు చెందిన సురేంద్ర బాబును రాష్ట్ర శాఖ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానన్నారు. ఈ అవకాశం కల్పించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 3, 2025
అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

కోడుమూరు మండలం గోరంట్లలో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం తనిఖీ చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులతో కలిసి గర్భిణులకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్, పాలు, గుడ్లు, బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే విషయంలో శుభ్రతను పాటించాలని ఆదేశించారు.
News December 3, 2025
డ్రైవింగ్లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News December 3, 2025
డ్రైవింగ్లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


