News March 2, 2025
ఏయూతో కలిసి పని చేయడానికి ఐడీఎస్ సిద్ధం: గాలబ్

ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధుల బృందం ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్తో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.గాలబ్ ఆచార్య రొక్కం రాధాకృష్ణ ప్రసంగాలు, పరిశోధనకు సంబంధించిన పుస్తకాన్ని బహుకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. పరిశోధన, బోధనా రంగాల్లో తాము సేవలందిస్తామన్నారు.
Similar News
News November 24, 2025
విశాఖలో హోంగార్డు అనుమానాస్పద మృతి.!

విశాఖ స్టీల్ ప్లాంట్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్న హోంగార్డు బి.కృష్ణారావు (56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం కూరగాయల కోసం బయటకు వెళ్లిన ఆయన కాసేపటికే విశాఖలోని 104 ఏరియా రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించారు. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు.
News November 24, 2025
విశాఖ తీరంలో విషాదం.. మరో మృతదేహం లభ్యం

విశాఖ లైట్ హౌస్ బీచ్లో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల ఘటన విషాదాంతమైంది. ఆదివారం తేజేశ్ మృతదేహం లభ్యం కాగా, సోమవారం ఉదయం ఆదిత్య మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. సముద్ర స్నానానికి దిగి అలల ధాటికి వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News November 24, 2025
బిజీబిజీగా విశాఖ పోలీసుల షెడ్యూల్

విశాఖలో పోలీసు యంత్రాంగం బిజీ బిజీ షెడ్యూల్తో విధులు నిర్వహిస్తున్నారు. వారం క్రితం CII సమ్మెట్ సభలును విజయవంతంగా విధులు నిర్వహించిన పోలీసులకు వరుసగా మూడు కార్యక్రమాలు జరగనున్నడంతో సవాల్గా మారింది. కనకమాలక్ష్మి దేవస్థానం పండుగ ఉత్సవాలు. మేరీ మాత ఉత్సవాలు, ఇండియా-సౌత్ ఆఫ్రికా వన్డే క్రికెట్ మ్యాచ్కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలుతో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.


