News June 23, 2024
ఏయూలో అధికారుల మార్పు
పదవీ విరమణ చేసి, పదవుల్లో కొనసాగుతున్న ఉద్యోగులు తక్షణం వైదొలగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మార్పు మొదలైంది. సైన్స్, మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్ను శనివారం నియమించారు. ఫార్మసీ, న్యాయ కళాశాల, ఐఏఎస్ఈ, ఏయు దూరవిద్యా కేంద్రం, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఓఎస్డీలను సైతం మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను అధికారులు ఆచరణలో పెట్టారు.
Similar News
News October 5, 2024
బుచ్చియ్యపేట: కరెంట్ షాక్.. బాలుడు మృతి
విద్యుత్ షాక్కు గురై బాలుడు మృతిచెందిన ఘటన బుచ్చియ్యపేట మండలంలోని పి.భీమవరంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన వేపాడ అప్పారావు కుమారుడు భువన్ శంకర్ శనివారం పొలంలోకి వెళ్లాడు. అక్కడ గెడ్డ దాటుతుండగా అప్పటికే నేలపై తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం చోడవరం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News October 5, 2024
విశాఖ: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాలిక మృతి
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పుంగనూరులో అదృశ్యమైన బాలిక మృతిచెందిందని ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆరోపించారు. పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేది కాదన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ.. కాలిన కాగితాలకున్న విలువ ఆడబిడ్డల ప్రాణాలకు లేదని విమర్శించారు. బాలిక మృతి సంఘటనను దర్యాప్తు లేకుండానే నీరు గార్చాలని పోలీసులు చూస్తున్నట్లు తెలిపారు.
News October 5, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. విజయవాడ BLP రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కార్మికులు భద్రత కోసం ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.