News October 3, 2024
ఏయూలో డిప్లొమో కోర్సులకు నోటిఫికేషన్

ఏయూలో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ డి.ఏ నాయుడు ప్రకటనలో తెలిపారు. ఏడాది కాల వ్యవధిలో నటన, దర్శకత్వం, లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, తాళ వాయిద్యం కోర్సుల్లో, ఆరు నెలలకు యోగా, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, ఫొటోగ్రఫీ, స్పానిష్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21లోగా దరఖాస్తు చేయాలి, 23న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. >Share it
Similar News
News December 8, 2025
జీవీఎంసీలో అడ్డగోలు ప్రతిపాదనలు వెనక్కి..!

జీవీఎంసీలో అభివృద్ధి పనులపై 287 అంశాలకు గాను 34 అంశాలను స్థాయి సంఘం ఆమోదం తెలపకూండా శనివారం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు ఆమోదం విషయంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారంటూ స్థాయి సంఘం సభ్యులపై వార్తలు రావడంతోనే వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చర్చ సమయంలో కొందరు అధికారుల తప్పిదాలకు తాము విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందని స్థాయి సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసు సైతం వ్యాఖ్యానించారు.
News December 8, 2025
విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో పై అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారని 1062 పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేశామన్నారు.
News December 8, 2025
MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్లో కూరగాయలు

MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్లో కూరగాయలు లభ్యమవుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో అమలు చేస్తున్న అధికారులు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. రైతు బజార్ ధరలకే డోర్ డెలివరీ చేస్తున్నారు. మాచింట్ సొల్యూషన్స్ అనే సంస్థ https://digirythubazaarap.com వెబ్సైట్ ద్వారా 5 రోజులుగా 150 మందికి డెలివరీ చేసింది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చార్జీలు లేవు.


