News September 8, 2024

ఏయూ అనుబంధ కళాశాలలకు రేపు సెలవు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఈ.ఎన్. ధనుంజయరావు తెలిపారు. రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మరల ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సెలవు ప్రకటించినట్లు ఆయన తెలియజేశారు.

Similar News

News November 18, 2025

పద్మనాభం దీపోత్సవానికి సర్వం సిద్ధం..

image

భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం మెట్ల మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.

News November 18, 2025

పద్మనాభం దీపోత్సవానికి సర్వం సిద్ధం..

image

భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం మెట్ల మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.

News November 18, 2025

సింహాచలం: తోటలో చిరు వ్యాపారి ఆత్మహత్య

image

అప్పులు బాధ తట్టుకోలేక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఆరిలోవ ప్రాంతానికి చెందిన జరజాపు వెంకట అజయ్ కుమార్ వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. అప్పులు ఎక్కువ కావడంతో సింహాచలం సమీపంలోని లండగరువు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.