News October 8, 2024
ఏయూ: ఎం.ఏ పాలి బుద్ధిజంలో ప్రవేశాలకు నోటిఫికేషన్
ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా విభాగంలో శ్రీలంకకు చెందిన జయవర్ధనపుర యూనివర్సిటీతో నిర్వహిస్తున్న పాలి బుద్ధిస్ట్ స్టడీస్ ఎం.ఏ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ డీ.ఏ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ కోర్సులో చేయడానికి అర్హులు. ఈనెల 24వ తేదీలోగా ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. 25న అడ్మిషన్ల కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
Similar News
News October 8, 2024
అనకాపల్లి: సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
అనకాపల్లి జిల్లాలో సాగినీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. సాగునీటి పారుదల వ్యవస్థలో రైతులను భాగస్వామ్యం చేసి సాగునీటి సంఘాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News October 8, 2024
విశాఖ: స్టీల్ ప్లాంట్పై కేంద్ర మంత్రితో సీఎం చర్చ
విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసే అంశంపై కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ఢిల్లీలో సీఎం అధికార నివాసంలో మంగళవారం కేంద్రమంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు.
News October 8, 2024
విశాఖ జిల్లాలో “పల్లె పండగ” వారోత్సవాలకు ప్రణాళిక సిద్ధం
విశాఖ జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు “పల్లె పండగ” వారోత్సవాలను ప్రణాళికాయుతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన సమీక్ష కలెక్టర్ మాట్లాడారు. రూ.29 కోట్ల అంచనా వ్యయంతో గ్రామీణ పరిధిలో 322 పనులకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు.