News September 5, 2024

ఏయూ నుంచి తొలి డాక్టరేట్ అందుకున్న సర్వేపల్లి

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తొలి డాక్టరేట్ అందుకున్న సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1931లో అదే వర్సిటీకి రెండో ఉపకులపతిగా వచ్చారు. 1931 నుంచి 1936 వరకు 5 సంవత్సరాలు సేవలు అందించారు. కేవలం 4 విభాగాలతో ప్రారంభమైన ఏయూను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేశారు. ఆయన హయాంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ గ్రహీత సీవీ రామన్ వంటి వారు ఏయూను సందర్శించడమే కాకుండా కొద్ది రోజులు ఇక్కడ ఉండడం విశేషం.

Similar News

News December 17, 2025

బతికున్నప్పుడే అన్నీ జరగాలి: అశోక్ గజపతి రాజు

image

ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు భావోద్వేగమయ్యారు. ‘మనం ఎప్పుడు చనిపోతామో చెప్పలేము.. బతికున్నప్పుడే సాధించాలి. నేను ఉన్నప్పుడే ఈ మంచి కార్యాలు జరగాలి. ప్రజలకు ఇంకా సేవ చేయాలి. నా తరువాత నా వారసులు ఆ పని కచ్చితంగా చేస్తారనే నమ్మకం నాకు ఉంది. మరిన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. అందుకు మీ ఆశీస్సులు ఉండాలంటూ’ ఆయన మాట్లాడారు.

News December 17, 2025

విశాఖలో 19న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్

image

సిరిపురంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో డిసెంబర్ 19న ఉదయం 10 గంటలకు ‘పెన్షన్/జీపీఎఫ్ అదాలత్’ నిర్వహించనున్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఏజీ శాంతి ప్రియ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ పెన్షన్, జీపీఎఫ్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు. సంబంధిత అధికారులు, డీడీవోలు తప్పక హాజరుకావాలని జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు కోరారు.

News December 17, 2025

విశాఖలో 19న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్

image

సిరిపురంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో డిసెంబర్ 19న ఉదయం 10 గంటలకు ‘పెన్షన్/జీపీఎఫ్ అదాలత్’ నిర్వహించనున్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఏజీ శాంతి ప్రియ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ పెన్షన్, జీపీఎఫ్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు. సంబంధిత అధికారులు, డీడీవోలు తప్పక హాజరుకావాలని జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు కోరారు.