News January 8, 2025

ఏయూ పరిధిలో పరీక్షలు వాయిదా

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల పరిధిలో నేడు జరగాల్సిన యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు పేర్కొన్నారు. నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరగాల్సిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని తెలిపారు.

Similar News

News November 6, 2025

విశాఖ: మహిళలను కాపాడిన లైఫ్ గార్డ్స్

image

RK బీచ్ గోకుల్ పార్క్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న మహిళలను లైఫ్ గార్డ్స్ కాపాడారు. గురువారం ఉదయం మహారాణి పేటకు చెందిన కీర్తి ఉషారాణి, సునీత పూజా సామాగ్రిని సముద్రంలో వదలడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కెరటాల తాకిడికి సముద్రం లోపలికి వెళ్లిపోతుండగా లైఫ్ గార్డ్స్ గమనించి వారిని రక్షించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

News November 6, 2025

విశాఖ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ!

image

విశాఖ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. స్టాంప్‌ పేపర్‌ లైసెన్స్‌ వెండర్లు, డాక్యుమెంట్‌ రైటర్లుగా తిష్ట వేసి ప్రజలను పీడిస్తున్నారు. పన్నులు, ఫీజులు, TDS చెల్లించినా ఆస్తి విలువను బట్టి 1% వరకు వారికి అదనంగా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. చలానాలు, ఫీజులు నేరుగా చెల్లించే అవకాశం లేకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటారు. దళారీ వ్యవస్థను పెకిలించాలని కోరుతున్నారు.

News November 6, 2025

విశాఖ: ఆదాయంలో సూపర్‌ బజార్‌‌ సబ్ రిజిస్ట్రార్ టాప్

image

ఈ ఆర్థిక సంవత్సరంలో విశాఖలోని 9 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయం గణనీయంగా పెరిగింది. మొదటి 7 నెలల్లోనే సుమారు రూ.600 కోట్ల ఆదాయం నమోదైనట్లు సమాచారం. సూపర్‌ బజార్‌, మధురవాడ కార్యాలయాలు అత్యధిక ఆదాయం సాధించగా.. అనందపురం, భీమునిపట్నం కార్యాలయాలు తక్కువ ఆదాయంతో చివర్లో నిలిచాయి. గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టు త్వరలో పూర్తి కానుండడంతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.