News February 18, 2025
ఏయూ వైస్ ఛాన్సలర్గా పీజీ రాజశేఖర్ నియామకం

విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఖరగ్పూర్ ఐఐటీకి చెందిన పీజీ రాజశేఖర్ను నియమిస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖరగ్పూర్ ఐఐటీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్గా పని చేస్తున్న పీజీ రాజశేఖర్ను వైస్ ఛాన్సలర్గా నియమించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 9, 2025
బీచ్ రోడ్డులో నేవీ ఉద్యోగుల పరిశుభ్రత కార్యక్రమం

ఆర్కే బీచ్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. INS డేగాకు చెందిన నేవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 30 మంది నావికులు,10 మంది అధికారులు బీచ్ ప్రాంతంలో చెత్తను తొలగించారు. ఈ డ్రైవ్ను స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
News December 9, 2025
విశాఖ: రేపటి నుంచి 21 వరకు టెట్ పరీక్ష

డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు జిల్లాలోని 12 కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ మంగళవారం తెలిపారు. విశాఖ జిల్లాలో 11 కేంద్రాలు, అనకాపల్లి, మాకవరపాలెంలో ఒక కేంద్రం ఉందని పేర్కొన్నారు. మొత్తం 26,248 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు వివరించారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
News December 9, 2025
విశాఖలో ఆయిల్ పామ్ సాగుకు 100% రాయితీ

విశాఖ జిల్లాలో 100 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యాన అధికారిణి శ్యామల తెలిపారు. రైతులకు 100% రాయితీపై మొక్కలు, అంతర పంటల నిర్వహణకు రూ.21,000 సాయం, డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇది 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం ఇస్తుందని, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల రైతులు ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


