News October 17, 2024

ఏయూ: MHRM, MBA సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న MHRM రెండో సెమిస్టర్, ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో నిర్వహిస్తున్న MBA నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల వివరాలను ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News December 29, 2025

విశాఖకు 150 పర్యావరణహిత బస్సులు

image

కేంద్ర ప్రభుత్వ ‘పీఎం-ఈబస్ సేవ’ పథకం కింద రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు కేటాయించగా.. ఇందులో విశాఖపట్నం నగరానికే అత్యధికంగా 150 బస్సులను అందిచనుండడం విశేషం. ఈ మేరకు ఆపరేటర్లను ఖరారు చేసేందుకు ఈఈఎస్ఎల్ (EESL) సంస్థ ఆర్టీసీకి లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేసింది. త్వరలోనే పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రిక్ బస్సులు వైజాగ్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి.

News December 29, 2025

విశాఖలో ఆగని కుక్కల దాడులు!

image

జీవీఎంసీ పరిధిలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. సింథియాలో ఈ నెల 21 నుంచి ఇప్పటివరకు 20 మందిపై కుక్కలు దాడి చేశాయి. GVMC పరిధిలో 2లక్షల వరకు కుక్కలు ఉన్నట్లు అంచనా. వాటి నియంత్రణ కోసం అరిలోవ, కాపులుప్పడ, సవరాల ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి కుక్కల ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వెటర్నరీ అధికారి రాజ రవికుమార్ తెలిపారు. రోజుకు 50 నుంచి 60 వరకు కుక్కల ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు.

News December 29, 2025

గాజువాక: ఉరి వేసుకుని బాలుడి ఆత్మహత్య

image

గాజువాక డిపో 59 వార్డు నక్కవానిపాలెంలో ఓ బాలుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో యుగంధర్ వర్మ (16) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.