News February 14, 2025
ఏర్పేడు: JRFకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్ -02 (JRF) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఐదు సంవత్సరాల ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్, ఎమ్మెస్సీ ఇన్ ఫిజిక్స్, ఎమ్మెస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iittp.ac.in వెబ్ సైట్ చూడాని పేర్కొంది.
Similar News
News October 31, 2025
ఉత్తమ సేవలకు SRR ప్రిన్సిపల్కు అభినందనలు

రాష్ట్రస్థాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ సదస్సు HYDలో జరిగింది. ఈ సదస్సులో SRR ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.రామకృష్ణను విద్యాశాఖ ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. కళాశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, కమిషనర్ దేవసేన, వైస్ ఛాన్సలర్ ప్రొ. రాజశేఖర్ లు ఆయనను శాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో అభినందించారు. విద్యారంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ సన్మానం జరిగింది.
News October 31, 2025
HYD: ఉక్కు మనిషి వల్లే ఊపిరి పీల్చాం!

భారత ఏకత్వానికి ప్రతీకగా నిలిచారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. 565 సంస్థానాలను ఒకే త్రివర్ణ పతాకం కింద సమీకరించిన మహనీయుడు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడంలో ఆయన చూపిన ధైర్యం చరిత్రలో చెరిగిపోదు. ఆపరేషన్ పోలో ద్వారా నిజాంపాలనకు తెరదించారు. ఉక్కు మనిషి ఉక్కు సంకల్పం వల్లే ఊపిరి పీల్చామనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరేమంటారు?
News October 31, 2025
తడిసిన ధాన్యాన్నీ ప్రభుత్వమే కొంటుంది: కలెక్టర్

మొంథా తుఫాను ప్రభావంతో నేలపాలైన వరి పంటలను, తడిసిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ B.సత్యప్రసాద్ శుక్రవారం భీమారం, కోరుట్ల మండలాల్లో పరిశీలించారు. దేశాయిపేట, మోహన్రావుపేట కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పరిస్థితిని తెలుసుకున్నారు. మొలకలు వచ్చినా, రంగు మారినా ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


