News March 2, 2025
ఏలూరును ఉలిక్కిపడేలా చేసిన చిన్నపిల్లల విక్రయాలు

ఇతర రాష్ట్రాల నుంచి చిన్నపిల్లలను తీసుకువచ్చి విజయవాడ, ఏలూరు ప్రాంతాలలో అమ్మకాలు జరిపే ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ ప్రకాష్ నగర్కు చెందిన సరోజినీ ఆధ్వర్యంలో ఒక ముఠా ఏలూరులో ముగ్గురు పిల్లలను అమ్మినట్లు తెలియటంతో పోలీసు బృందాలు చేరుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. ఆడ శిశువు రూ.3 లక్షలు, మగ శిశువుని రూ.5 లక్షలకు ఈ ముఠా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
Similar News
News December 8, 2025
NSU లైంగిక వేధింపుల ఘటన.. ముందే తెలిసినా.!

తిరుపతి NSUలో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చినా వర్సిటీ వర్గాలు ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేశాయని పోలీసుల వర్గాల సమాచారం. శనివారం సాయంత్రం వర్సిటీ సిబ్బంది స్టేషన్కు వెళ్లి ‘నిందితుల ఫోన్లు తెచ్చాము, పరిశీలించండి’ అనడంతో పోలీసులు అవాక్కయ్యారట. ఫిర్యాదు చేస్తేనే విచారణ చేపడతామని వారు తెగేసి చెప్పడంతో వేరే దారి లేక ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
News December 8, 2025
నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ

జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్సభలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ చర్చను ప్రారంభించి సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. ఈ గేయంపై 10 గంటలపాటు చర్చ సాగనుంది. రాజ్యసభలో అమిత్షా చర్చను మొదలుపెడతారు. స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై పలువురు ఎంపీలు మాట్లాడతారు.
News December 8, 2025
అప్పట్లో చందర్పాల్.. ఇప్పుడు స్మిత్ ఎందుకంటే?

యాషెస్ 2వ టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్మిత్ బ్యాటింగ్ చేసే సమయంలో కళ్ల కింద నల్లటి స్టిక్కర్లు అంటించుకొని కనిపించారు. వాటిని యాంటీ గ్లేర్ స్ట్రిప్స్ అని అంటారు. కాంతి నేరుగా కళ్ల మీద పడకుండా అవి ఆపుతాయి. ముఖ్యంగా ఫ్లడ్ లైట్ల నుంచి వచ్చే కాంతిని కట్ చేసి బంతి స్పష్టంగా కనిపించేందుకు సాయపడతాయి. గతంలో వెస్టిండీస్ లెజండరీ బ్యాటర్ చందర్పాల్ కూడా ఇలాంటివి ధరించేవారు. మీకు తెలిస్తే COMMENT చేయండి.


