News April 5, 2025
ఏలూరులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి

ఏలూరులోని శ్రీరామ్ నగర్లో నివాసముంటున్న ఓ వ్యక్తి మూడురోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందాడు. శుక్రవారం రాత్రి ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి శివరామకృష్ణ (46)గా తెలుస్తుంది. గతంలో సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేశాడని కాలనీవాసులు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Similar News
News November 13, 2025
తిరుమల: అన్ని వేళ్లు వైవీ సుబ్బారెడ్డి వైపే…!

తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో అన్ని వేళ్లు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వైపే చూపిస్తున్నాయి. గతంలో ఉన్న టెండర్ల విధానంలో మార్పులు తీసుకురావడంతో ఆయన తీరుపై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. దానికి తోడు ఆయన పీఏ చిన్న అప్పన్న అరెస్టుతో కూడా సుబ్బారెడ్డిపై అనేక ఆరోపణలకు కారణమవుతుంది.
News November 13, 2025
క్షేత్ర స్థాయి పరిశీలనలో వరంగల్ మున్సిపల్ కమిషనర్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ నగరంలోని పలు డివిజన్లలో ఆకస్మికంగా పర్యటించి వసతులను పరిశీలించారు. 34వ డివిజన్ శివనగర్లో ఆమె పర్యటించి తాగునీటి సమస్య, డ్రైనేజీలు, పారిశుద్ధ్య కార్మికుల పనితీరును పరిశీలించారు. డివిజన్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
News November 13, 2025
ఉమ్మడి మెదక్ నుంచి టీ.టీకి ఎంపికైంది వీరే.!

ఉమ్మడి మెదక్ జిల్లా టీ.టీ అండర్ -14, 17 బాల, బాలికలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. U/17 బాలురు.. జి.గౌతమ్ కుమార్, జి.భరద్వాజ్, కే. చరణ్, U/17 బాలికలు.. పి.నవ్యశ్రీ, పి.బృహతి, ఎస్.నందిని, U/14 బాలురు.. బి.ఆయుష్, కే.ప్రతీక్, ఎస్.నర్సింగరావు, U/14 బాలికలు.. టీ.మౌనిక, ఎన్.భానుప్రియ, పి.లాస్య ఉన్నారు. వీరు ఈనెలలో ఖమ్మంలో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు.


