News April 5, 2025
ఏలూరులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి

ఏలూరులోని శ్రీరామ్ నగర్లో నివాసముంటున్న ఓ వ్యక్తి మూడురోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందాడు. శుక్రవారం రాత్రి ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి శివరామకృష్ణ (46)గా తెలుస్తుంది. గతంలో సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేశాడని కాలనీవాసులు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Similar News
News January 11, 2026
పండుగల్లో డైట్ జాగ్రత్త

పండుగ రోజుల్లో సాధారణంగా చాలా త్వరగా లేచి హడావిడిగా పనులు చేస్తుంటారు. టిఫిన్ చేసే టైం లేక కనిపించిన పిండి వంటలనే నోట్లో వేసుకుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకొని తాగడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఈ సమయంలో కాఫీలు, కూల్ డ్రింకులు కాకుండా కొన్ని పండ్లు, పండ్ల రసాలు అందుబాటులో పెట్టుకోండి. దీంతో జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు త్వరగా భోజనం చెయ్యాలి.
News January 11, 2026
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: నిర్మల్ ఎస్పీ

నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఆదివారం జిల్లావ్యాప్తంగా పోలీసులు చైనా మాంజా విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దుకాణాలు, స్టేషనరీ షాపులను తనిఖీ చేసిన అధికారులు.. నిషేధిత నైలాన్ మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మాంజా పక్షులకు, ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదకరమని ఎస్పీ పేర్కొన్నారు. సంక్రాంతి వేళ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
News January 11, 2026
నారాయణపురం: 57 ఏళ్లు.. 18 పట్టాలు

మండలానికి చెందిన ఇమ్మడి నాగేష్ అక్షరాలతోనే సహవాసం చేస్తూ అనేక కోర్సుల్లో 18 పట్టాలు సాధించారు. సొంత ఊర్లో ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన నాగేష్ ఇటీవల 57 ఏళ్ల వయసులో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి యోగాలో డిప్లొమా కోర్సు చేసి పట్టా స్వీకరించారు. తన ఊరిలో ‘గ్రామ శ్రీ’ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య శిబిరాలతో పాటు విద్యార్థులకు తీర్థ వికాస శిక్షణాసేవా వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


